Saindhav OTT News: విడుదలైన 3 వారాల్లోనే ప్రముఖ ఓటీటీలో వెంకటేష్ సైంధవ్.. అధికారిక ప్రకటన..

Saindhav OTT News: సంక్రాంతి సినిమాల్లో ఎలాంటి బజ్ లేకుండా విడుదలై సోది లేకుండా పోయిన సినిమా విక్టరీ వెంకటేష్ 'సైంధవ్'. మొత్తంగా పొంగల్ సినిమాల పోటీలో ఈ సినిమా అడ్రస్ లేకుండా పోయింది. మొత్తంగా వెంకీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. విడుదలైన ఫస్ట్ వీకెండ్ కే థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా ఓటీటీ డేట్ లాక్ చేసుకుంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 31, 2024, 01:51 PM IST
Saindhav OTT News: విడుదలైన 3 వారాల్లోనే ప్రముఖ ఓటీటీలో వెంకటేష్ సైంధవ్..  అధికారిక ప్రకటన..

Saindhav OTT News: విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'సైంధవ్'. గతేడాది చివర్లో విడుదల కావాల్సిన ఈ మూవీ ప్రభాస్ 'సలార్' కారణంగా పొంగల్ పోటీలో విడుదలైంది. అయితే పండగ సీజన్‌లో   హనుమాన్, గుంటూరు కారం వంటి సినిమాలతో నాగార్జున హీరోగా నటించిన 'నా సామి రంగ' సినిమాలు విడుదలయ్యాయి. స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన 'సైంధవ్' మూవీకి మంచి టాక్ వచ్చినా పోటీలో పెద్ద సినిమాలు ఉండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ అడ్రస్ గల్లంతయింది.

ఇక వెంకటేష్ నటించిన సైంధవ్ విషయానికొస్తే.. ఈ మూవీలో యాక్షన్ కమ్ పాప సెంటిమెంట్ పాళ్లు ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎందుకో వర్కౌట్ కాలేదు. మరోవైపు ఈ సినిమాలో  ఉన్న విపరీతమైన హింస కారణంగా ఈ మూవీ సంక్రాంతి పోటీలో అడ్డంగా బుక్కై నలిగిపోయింది.తన బేస్ ఫ్యామిలీ ఆడియన్స్‌కు దూరంగా ఈ సినిమా ఉండటం సైంధవ్‌కు నెగిటివ్‌గా మారింది.

ఇక 'సైంధవ్' సినిమా వెంకటేష్ కు 75వ సినిమా. తన లాండ్ మార్క్ మూవీని దర్శకుడు శైలేష్ కొలను బాగానే తెరకెక్కించినా.. హీరోకు విలన్స్ ఎందుకు భయపడతారనే విషయాన్ని తెరపై కన్విన్స్‌గా చెప్పడంలో తడబడ్డాడు.  తన గత రెండు చిత్రాలు 'హిట్ -1, హిట్ -2 చిత్రాలను పోలీస్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించిన శైలేష్ కొలను.. ఈ చిత్రాన్ని మాఫియా బ్యాక్ డ్రాప్‌లో సరికొత్తగా ప్రెజెంట్ చేసాడు.  అయినా పెద్దగా ప్రయోజనం దక్కలేదు.

ముఖ్యంగా ఇలాంటి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టేనర్‌లను ఏ సినిమా పోటీలో లేకుండా సోలోగా రిలీజ్ చేస్తే మంచి ప్రయోజనం అయినా దక్కేది. కానీ సంక్రాంతి సీజన్ అంటూ ఎగబడి మొత్తానికి ఎసరు తెచ్చుకున్నారు. ఏది ఏమైనా తన కెరీర్‌లో లాండ్ మార్క్ మూవీగా నిలిచిపోతుందనున్న 'సైంధవ్' వెంకటేష్‌కు చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఈ మూవీలో ఇతర ముఖ్యపాత్రల్లో నవాజుద్దీన్ సిద్దిఖీ, ముఖేష్ రుషి, జిషుసేన్ గుప్తా నటించారు. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ ఫీమేల్ లీడ్ పాత్రల్లో కనిపించారు. మొత్తంగా రూ. 30 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీ కనీసం రూ. 10 కోట్ల షేర్ రాబట్టలేక చతికిల బడింది.  

ఇక సైంధవ్ మూవీ థియేట్రికల్ రన్ ముగియడంతో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకుంది. ఫిబ్రవరి 3 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళ వెర్షన్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. ప్యాన్ ఇండియా మూవీ అంటూ హంగామా చేసిన ఈ మూవీ ఓటీటీలో ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ మూవీ శాటిలైట్ హక్కులను ఈటీవీ దక్కించుకుంది.

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News