Thank You: చేతూ మూవీలో ముగ్గురమ్మాయిలు

మనం సినిమా తరువాత అక్కినేని నాగ చైతన్య, విక్రమ్ కే కుమార్ కాంబినేషన్ మరో సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసింది. 

Last Updated : Nov 4, 2020, 10:38 PM IST
    • మనం సినిమా తరువాత అక్కినేని నాగ చైతన్య, విక్రమ్ కే కుమార్ కాంబినేషన్ మరో సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసింది.
    • హెల్లో, 24 చిత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ కే కుమార్ ఈ కొత్త సినిమాకు థ్యాంక్యూ అనే టైటిల్ ఫిక్స్ చేశాడు.
    • తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన ముగ్గురు కథానాయికలు కనిపించనున్నారట.
Thank You: చేతూ మూవీలో ముగ్గురమ్మాయిలు

మనం సినిమా తరువాత అక్కినేని నాగ చైతన్య, విక్రమ్ కే కుమార్ కాంబినేషన్ మరో సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసింది. హెల్లో, 24 చిత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ కే కుమార్ ఈ కొత్త సినిమాకు థ్యాంక్యూ అనే టైటిల్ ఫిక్స్ చేశాడు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో నాగ చైతన్య (Naga Chaitanya ) సరసన ముగ్గురు కథానాయికలు కనిపించనున్నారట.

Also Read | TS High Court: అగ్రీగోల్డ్ కేసు విచారణను స్వీకరించిన తెలంగాణ హైకోర్టు

డిసెంబర్ నుంచి థ్యాంక్యూ చిత్రం షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. మన్మథుడు 2 కథానాయిక అయిన రకుల్ ప్రీత్ సింగ్ ( Rakul Preet Singh ) ఈ మూవీలో మరో కథానాయికగా నటించనుంది అని... ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి అని సమాచారం. అయితే దీనిపై అధికారికంగా ఇంకా ఎలాంటి సమాచారం లేదు. మరోవైపు గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంకా అరుల్ మోహన్ ఈ మూవీలో మరో హీరోయిన్ గా సందడి చేయనుంది అని సమాచారం. ప్రస్తుతం మూడో హీరోయిన్ కోసం వేట కొనసాగుతోంది అని తెలుస్తోంది. 

Also Read | AP Board of Intermediate: విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల

విక్రమ్ కే కుమార్, నాగ చైతన్య కాంబినేషన్ లో వస్తోన్న థ్యాంక్యూ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు తెరకెక్కిస్తున్నాడు. డిసెంబర్ లో చిత్రీకరణ మొదలు పెట్టి 2021 దితీయార్థంలో సినిమాను విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ఈ మూవీనీ కమర్షియల్ ఎంటెర్టైనర్ గా తెరక్కించాలని సన్నాహాలు చేస్తున్నారు.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News