Director Teja: చిత్రం సినిమాకు 21 ఏళ్ల తరువాత సీక్వెల్ ప్రకటించిన డైరెక్టర్ తేజ

Director Teja Announces Sequel To Chitram Movie: కొత్త డైరెక్టర్ తేజ, హీరోహీరోయిన్లు ఉదయ్ కిరణ్, రీమా సేన్ సైతం తెలుగు వెండితెరకు తొలి పరిచయం అయినప్పటికీ వీరి అరంగేట్రం అదుర్స్ అని చెప్పవచ్చు. 21 ఏళ్ల తరువాత మరో ప్రయోగానికి తేజ సిద్దమయ్యారు.

Written by - Shankar Dukanam | Last Updated : Feb 22, 2021, 05:45 PM IST
  • టాలీవుడ్‌లో దాదాపు 21 ఏళ్ల కిందట విడుదలై విజయాన్ని అందుకున్న సినిమా చిత్రం
  • మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ సైతం చిత్రంతోనే ఎంట్రీ ఇచ్చి విజయాన్ని అందుకున్నారు
  • తాజాగా ఈ చిత్రం సినిమాకు సీక్వెల్‌కు శ్రీకారం చుట్టారు డైరెక్టర్ తేజ, 45 మంది కొత్తవాళ్లు
Director Teja: చిత్రం సినిమాకు 21 ఏళ్ల తరువాత సీక్వెల్ ప్రకటించిన డైరెక్టర్ తేజ

Director Teja Announces Sequel To Chitram Movie: టాలీవుడ్‌లో దాదాపు 21 ఏళ్ల కిందట విడుదలై విజయాన్ని అందుకున్న సినిమా చిత్రం. కొత్త డైరెక్టర్ తేజ, హీరోహీరోయిన్లు ఉదయ్ కిరణ్, రీమా సేన్ సైతం తెలుగు వెండితెరకు తొలి పరిచయం అయినప్పటికీ వీరి అరంగేట్రం అదుర్స్ అని చెప్పవచ్చు. చిత్ర సినిమా గురించి ఇప్పుడెందుకు అంటారా. తాజాగా ఈ చిత్రం సినిమాకు సీక్వెల్‌కు శ్రీకారం చుట్టారు డైరెక్టర్ తేజ.

వీరితో పాటు మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ సైతం తన ఫస్ట్ మూవీ చిత్రంతోనే ఎంట్రీ ఇచ్చి విజయాన్ని అందుకున్నారు. ఆపై వరుసగా మూవీలకు స్వరాలు సమకూర్చారు. నేడు డైరెక్టర్ తేజ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిత్రం సినిమాకు సీక్వెల్ చిత్రం 1.1 తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. 21 ఏళ్ల తరువాత మరోసారి కొత్త వాళ్లతో మ్యాజిక్ చేసేందుకు డైరెక్టర్ తేజ(Director Teja) నిర్ణయం తీసుకున్నారు.

Also Read: Chiranjeevi Acharya Shooting: రాజమండ్రిలో చిరంజీవికి అపూర్వ స్వాగతం, ఏజెన్సీ ప్రాంతంలో Acharya Shooting

సినిమా తీసేందుకు కావాలసిన విభాగాల టెక్నీషియన్లు, టాలీవుడ్(Tollywood) నూతన నటీనటులు దాదాపు 45 మందిని కొత్త వారితో తేజ చిత్రం 1.1 తెరకెక్కించున్నాడని తెలుస్తోంది.  అయితే తాను కథను మాత్రమే నమ్మి సినిమా తీస్తానని చెప్పే దర్శకులలో తేజ ఒకరని కావడంతో కొందరు మాత్రమే పాత టెక్నీషియన్లతో పని చేసేందుకు సిద్ధమయ్యాడు.

Also Read: Kareena Kapoor Baby: పండంటి బాబుకు జన్మనిచ్చిన కరీనా కపూర్, Saif Ali Khan సంబరాలు

గతంలో కాలేజీ క్యాంపస్ సినిమాలు చేసి సూపర్ హిట్స్ అందుకున్న డైరెక్టర్ ఆ తరువాత కాలంలో తన స్టైల్ పూర్తిగా మార్చేశాడు. అయితే తన లేటెస్ట్ ప్రాజెక్ట్ చిత్రం 1.1కు సినిమాటోగ్రాఫర్‌గా సమీర్ రెడ్డిని, ఎడిటర్‌గా కోటగిరి వెంకటేశ్వరరావును తీసుకున్నాడు. త్వరలోనే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి షూటింగ్ ప్రారంభించనున్నారు.

Also Read: kapatadhaari movie telugu review: కపటధారి మూవీ రివ్యూ 

నేనే రాజు నేనే మంత్రి, సీత లాంటి సినిమాలతో గత కొంతకాలం నుంచి డైరెక్టర్ తేజ తిరిగి హిట్ ట్రాక్ బాట పట్టాడు. మరోసారి యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌ను తేజ నుంచి తెలుగు ప్రేక్షకులు ఆశిస్తున్నారు. కొత్త వారితో అయినా సరే విజయాన్ని అందుకునేందుకు కావాలసిన అంశాల్ని చూపించడంలో తేజ దిట్ట.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News