Chiranjeevi: చిరంజీవి నిద్రలేవగానే ముందుగా ఎవరి ముఖం చూస్తారో తెలుసా.. ఎవరు ఊహించి ఉండరు..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయాలు అక్కర్లేని పేరు. దాదాపు పాతికేళ్లుగా సినీ రంగంలో నంబర్ కథానాయకుడిగా సత్తా చాటారు. ఇక ఈయనకు ఫేవరేట్ హీరో ఎవరు.. ? హీరోయిన్ ఎవరనేది ఎపుడు ఆసక్తికర అంశం. ఇక చిరంజీవి రోజు నిద్రలేవగానే ముందుగా ఎవరి ముఖం చూస్తారో తాజాగా ఓ ఈవెంట్‌లో వెల్లడించారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 3, 2024, 09:47 AM IST
Chiranjeevi: చిరంజీవి నిద్రలేవగానే ముందుగా ఎవరి ముఖం చూస్తారో తెలుసా.. ఎవరు ఊహించి ఉండరు..

Chiranjeevi: చిరంజీవి.. తన తరంలో స్వయంకృషితో ఒక్కో మెట్టు ఎక్కుతూ సుప్రీం హీరోగా.. మెగాస్టార్‌గా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక పేజీలనే రాసుకున్నాడు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈయన చేసిన సేవలకు గాను పద్మవిభూషణ్‌తో గౌరవించింది. అక్కినేని, ఎస్పీ బాలు తర్వాత టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ నుంచి ఈ ఘనత అందకున్న మూడో వ్యక్తిగా చిరంజీవి రికార్డులకు ఎక్కాడు. ఆ సంగతి పక్కన పెడితే... చిరంజీవి ఇష్టాఇష్టాల గురించి తెలుసుకోవడానికి ఆయన అభిమానులు ఎంతో ఉత్సాహం చూపిస్తుంటారు. ఇక చిరంజీవి రోజు ఉదయం లేవగానే ఎవరి  ముఖం చూస్తారనేది తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉదయం లేవగానే ముందుగా దేవుడి ఫోటోగానీ.. తల్లిదండ్రుల ఫోటోగానీ చూస్తారు. కానీ చిరంజీవి మాత్రం .. తనకు ఎంతో ఇష్టమైన మహానటి సావిత్రి గారి ఫోటోను నిద్రలేవగానే చూడటం అలవాటట. ఈ విషయాన్ని తాజాగా సావిత్రి కూతురు చాముండేశ్వరి గారు తెలిపారు. తాజాగా సావిత్రి పై ఆమె రాసిన 'సావిత్రి క్లాసిక్స్' పుస్తకాన్ని చిరంజీవి దంపతులు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిరు ఉదయం లేవగానే సావిత్రి గారి ఫోటోను చూసి కానీ వేరే పనులు చేయరన్న  విషయాన్ని వెల్లడించారు.

మరోవైపు సావిత్రి గారితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు చిరంజీవి. మహానటితో కలిసి 'పునాది రాళ్లు' సినిమాలో కలిసి నటించడం తన అదృష్టమన్నారు. అంతేకాదు ఈమె ముందు డాన్స్ చేయడం.. ఆమె తాను హీరోగా పైకి వస్తానని ఆశీర్వదించడం తనకు బాగా గుర్తుందన్నారు. సావిత్రి గారిని మొదటిసారి పునాది రాళ్లు షూటింగ్ కోసం రాజ మహేంద్రవరంలో వెళ్లి కలిశాను. ఆవిడను చూడగానే తనకు నోట మాట రాలేదు. మహానటి తన పేరు అడిగిన విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. అపుడు తన పేరు ప్రసాద్ నుండి చిరంజీవిగా మార్చుకున్న తర్వాత జరిగిన సంఘటను గుర్తు చేసుకున్నారు. చిరంజీవి అని చెప్పగానే శుభం అన్నారు. ఆ తర్వాత ఆమె కోరిక మేరకు డాన్స్ చేయమంటే చేశాను.

నా డాన్స్ మూమెంట్స్ చూసి మంచి నటుడి అవుతావు అని ఆశీర్వాదించారు. అంటూ అప్పట్లో మహానటి సావిత్రగారితో గడిపిన మధుర క్షణాలను ఈ సందర్భంగా చిరంజీవి గుర్తు చేసుకున్నారు.  
చిరంజీవి విషయానికొస్తే.. ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో 'విశ్వంభర' సినిమా చేస్తున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో చిరు సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

Also Read: CSK Fan Died: ఐపీఎల్‌లో విషాదం.. రోహిత్‌ శర్మ ఔట్‌పై వివాదం.. సీఎస్కే అభిమాని మృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News