Repo Rate Hike: మళ్లీ పెరగనున్న రెపో రేటు.. ఈఎంఐల మోత తప్పదా..?

RBI MPC Meeting: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ సమావేశం వచ్చే నెల 3వ తేదీన జరగనుంది. ఈ సమావేశంలో రెపో రేటు పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో మరోసారి ఈఎంఐల భారం పెరగనుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 27, 2023, 12:14 PM IST
Repo Rate Hike: మళ్లీ పెరగనున్న రెపో రేటు.. ఈఎంఐల మోత తప్పదా..?

RBI MPC Meeting: మరోసారి బ్యాంక్ వినియోగదారులకు మోత తప్పేలా లేదు. ఏప్రిల్ ప్రారంభంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య సమీక్ష సమావేశాన్ని నిర్వహించబోతోంది. రిటైల్ ద్రవ్యోల్బణం సంతృప్తికరమైన ఆరు శాతం కంటే ఎక్కువగా ఉండటం.. యూఎస్ ఫెడరల్ రిజర్వ్‌తో సహా అనేక కేంద్ర బ్యాంకుల దూకుడు వైఖరి నేపథ్యంలో రెపో రేటును 0.25 శాతం పెంచవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ద్రవ్య విధాన నిర్ణయానికి మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ద్వైమాసిక సమీక్ష సమావేశం ఏప్రిల్ 3 నుంచి ప్రారంభం కానుంది. మూడు రోజుల సమావేశాలు జరగనున్నాయి. ఏప్రిల్ 6న పాలసీ రేటుపై నిర్ణయం వెలువడనుంది.

ఈ సమావేశంలో ద్రవ్య విధానానికి సంబంధించిన అన్ని దేశీయ, అంతర్జాతీయ అంశాలను సమగ్రంగా సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం పరిస్థితి, ఫెడరల్ రిజర్వ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వంటి ప్రధాన కేంద్ర బ్యాంకుల ఇటీవలి దశలు కూడా విశ్లేషించనున్నారు. కాగా.. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు గతేడాది మే నుంచి పాలసీ వడ్డీ రేటు నిరంతరం పెరుగుతున్న విషయం తెలిసిందే.  గతడాది నుంచి రెపో రేటు నాలుగు శాతం నుంచి 6.50 శాతానికి పెరిగింది.  

వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జనవరిలో 6.52 శాతం, ఫిబ్రవరిలో 6.44 శాతంగా ఉంది. రిటైల్ ద్రవ్యోల్బణం ఈ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్‌బిఐకి నిర్దేశించిన సౌకర్యవంతమైన ఆరు శాతం కంటే ఎక్కువగా ఉంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనామిస్ట్ మదన్ సబ్నవిస్ మాట్లాడుతూ.. గత రెండు నెలలుగా ద్రవ్యోల్బణం ఆరు శాతం కంటే ఎక్కువగానే ఉండడం, లిక్విడిటీ దాదాపు తటస్థంగా ఉండడంతో ఆర్‌బీఐ మరోసారి రెపో రేటును 0.25 శాతం పెంచే అవకాశం ఉందని చెప్పారు. దీంతో పాటు ఆర్‌బీఐ వైఖరిని తటస్థంగా ప్రకటించడం ద్వారా రేట్ల పెంపు దశ ముగిసినట్లు ప్రకటించవచ్చన్నారు. 

ఎంపీసీ సమావేశంలో రెపో రేటును 0.25 శాతం పెంచవచ్చని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ చీఫ్ ఎకనామిస్ట్ డీకే పంత్ కూడా అంచనా వేశారు. ఈసారి వడ్డీ రేటును పెంచే ప్రక్రియను నిలిపివేయాలని నిర్ణయించవచ్చని పీడబ్ల్యూసీ ఇండియా భాగస్వామి రానెన్ బెనర్జీ అభిప్రాయపడ్డారు. రెపో రేటు పెరిగితే.. ప్రతినెల చెల్లించే ఈఎంఐ కూడా పెరగనుంది. ఏప్రిల్‌లో ఈ ఆర్థిక సంవత్సరానికి మొదట సమావేశం నిర్వహించనుంది. ఆర్‌బీఐ ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆరు ఎంపీసీ సమావేశాలను నిర్వహిస్తుంది.

Also Read: BCCI: బీసీసీఐ కాంట్రాక్ట్ గ్రేడ్స్ ప్రకటన.. పాండ్యా, జడేజాకు ప్రమోషన్.. ఈ ప్లేయర్లు ఔట్..!  

Also Read: IPL 2023: ఐపీఎల్‌ 2023లో ఈ ఐదుగురి ఆటగాళ్లపై ఓ కన్నేయండి.. క్రీజ్‌లోకి దిగితే బౌలర్లకు వణుకే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News