Upcoming smartphones: ఈ నెలలో విడుదలవనున్న 5 స్మార్ట్​ఫోన్లు ఇవే..!

Upcoming smartphones: ఈ నెలలో పెద్ద సంఖ్యలో కొత్త స్మార్ట్​ఫోన్లు విడుదల కానున్నాయి. మార్కెట్ వర్గాల ప్రకారం షియోమీ, శాసంగ్, రియల్​మీ వంటి సంస్థలు కొత్త కొత్త మోడళ్లను అందుబాటులోకి తేనున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 13, 2022, 06:39 PM IST
  • ఈ నెలలో కొత్త స్మార్ట్​ఫోన్ల సందడి
  • దిగ్గజ బ్రాండ్ల నుంచి సరిరకొత్త మోడళ్లు
  • శాంసంగ్​ నుంచి రెండు ఫోన్లు
Upcoming smartphones: ఈ నెలలో విడుదలవనున్న 5 స్మార్ట్​ఫోన్లు ఇవే..!

Upcoming smartphones: కొత్తగా స్మార్ట్​ఫోన్ కొనేందుకు ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. ఈ నెలలో ప్రముఖ స్మార్ట్​ఫోన్​ బ్రాడ్లు రియల్​మీ, రెడ్​మీ, శాంసంగ్​ సహా ఇతర కంపెనీలు భారీగా కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేయనున్నాయి. మరి ఆ కొత్త ఫోన్ల ధరలు ఎంత ఉండొచ్చు? వాటి ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయి? అని విషయాలపై మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ నెలలో రానున్న స్మార్ట్​ఫోన్లు

రెడ్​మీ 10: షియోమీకి చెందిన రెడ్​మీ బ్రాండ్​ త్వరలో కొత్త స్మార్ట్​పోన్​ను విడుదల చేయనుది. రెడ్​మీ 10 పేరుతో దీనిని విడుదల చేయనుంది. బడ్జెట్ ధరలో ఈ స్మార్ట్​ఫోన్​ను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇప్పటపి వరకు ఉన్న వివరాల ప్రకారం.. రూ.8,999గా ఈ స్మార్ట్​ఫోన్ ధరను నిర్ణయించే వీలుందని తెలుస్తోంది. 50 ఎంపీ రియర్​ కెమెరాతో ఈ ఫోన్​ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

షియోమీ రెడ్​మీ కే50

ఇక రెడ్​మీలోనే ప్రీమియం సెగ్మెంట్​లో రెడ్​మీ కే50 పేరుతో మార్చి 17నే మరో ఫోన్​ విడుదలయ్యే వీలుంది. అయితే ఇది తొలుత అంతర్జాతీయ మార్కెట్లోకి విడుదలవ్వచ్చని సమాచారం. ఇండియా మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందనే దానిపై ఇంకా క్లారిటీ లేదు.

రియల్​మీ జీడీ 2 సిరీస్​..

రియల్​మీ గేమింగ్​ ఫోన్ జీటీ 2 సిరీస్​ను ఈ నెల 22న ఇండోనేషియా మార్కెట్లోకి విడుదల చేయనుంది కంపనీ. అయితే దీనిపై ఇంకా కంపెనీ నుంచి అధికారిక ప్రకట రాలేదు. అదే సమయంలో ఇండియాలోనూ ఈ ఫోన్​ విడుదల కావచ్చని తెలుస్తోంది.

రియల్​మీ జీటీ నియో 3

రియల్​మీ నుంచి మరో స్మార్ట్​ఫోన్​.. జీటీ నియో 3 ఈ నెలాఖరున విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఈ స్మార్టర్​ఫోన్​ 150 వాట్స్ ఫాస్ట్​ ఛార్జింగ్ సపోర్ట్​తో అందుబాటులోకి రావచ్చని సమాచారం. ఇదే కాకుండా భారీ కెమెరా కూడా ఈ స్మార్ట్​ఫోన్లో ఉండనున్నట్లు అంచనాలు వస్తున్నాయి. అయితే భారత మార్కెట్లో మాత్రం ఈ స్మార్ట్​ఫోన్ జూన్ సమయంలో విడుదల కావచ్చని తెలుస్తోంది.

శాంసంగ్​ నుంచి రెండు ఫోన్లు..

శాంసంగ్​ నుంచి మార్చి 17న రెండు స్మార్ట్​ఫోన్లు ఒకేసారి విడుదల కానున్నట్లు తెలిసింది. గెలాక్సీ ఏ 53, గెలాక్సీ ఏ 73 పేర్లతో కొత్త స్మార్ట్​ఫోన్లు మార్కెట్లోకి విడుదల కానున్నాయట. దీనిపై శాంసంగ్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Also read: ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్... ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంపు..

Also read: March 2022 Bank Holidays: ఈ నెలలో బ్యాంకులకు ఇంకా 7 సెలవులు- పూర్తి జాబితా ఇదే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News