వైఎస్ జగన్ రిక్వెస్ట్.. సానుకూలంగా స్పందించిన గుజరాత్ సీఎం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజ్ఞప్తిపై గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సానుకూలంగా స్పందించారు.

Last Updated : Apr 21, 2020, 02:20 PM IST
వైఎస్ జగన్ రిక్వెస్ట్.. సానుకూలంగా స్పందించిన గుజరాత్ సీఎం

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజ్ఞప్తిపై గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సానుకూలంగా స్పందించారు. లాక్‌డౌన్ కారణంగా తెలుగు మత్స్యకారులు గుజరాత్‌లో చిక్కుకుపోయారు. ఈ విషయం సీఎం వైఎస్ జగన్‌కు చేరింది. దీనిపై గుజరాత్ సీఎంకు జగన్ ఫోన్ చేసి మాట్లాడారు.  బ్రేకింగ్: ఏపీలో మరో 35 కరోనా కేసులు

లాక్‌డౌన్ కారణంగా ఏపీ మత్స్యకారులు గుజరాత్‌లో చిక్కుకుపోయారని, వారికి వసతి, భోజన సదుపాయాల విషయంలో అసౌకర్యం కలగకుండా చూడాలని విజయ్ రూపానీకి వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. జగన్ విజ్ఞప్తిపై గుజరాత్ సీఎం సానుకూలంగా స్పందించారు. తెలుగు మత్స్యకారులను ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.  

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

 ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos

Trending News