AP: విజయవాడలో భారీ దోపిడీ

ఏపీ రాజధాని ప్రాంతంలోని విజయవాడలో పట్టపగలే భారీ చోరీ జరిగింది. నగరంలోని వన్ టౌన్ ప్రాంతంలోని సాయి జ్యువెల్లరీలో జరిగిన దొంగతనం కలకలం రేపింది.

Last Updated : Jul 24, 2020, 04:30 PM IST
AP: విజయవాడలో భారీ దోపిడీ

ఏపీ రాజధాని ప్రాంతంలోని విజయవాడలో పట్టపగలే భారీ చోరీ జరిగింది. నగరంలోని వన్ టౌన్ ప్రాంతంలోని సాయి జ్యువెల్లరీలో జరిగిన దొంగతనం కలకలం రేపింది.

విజయవాడ ( Vijayawada )వన్ టౌన్ ప్రాంతం. ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉన్న సాయి జ్యువెల్లరీ నగల దుకాణపు గుమస్తాను కాళ్లు, చేతులు కట్టేసి మరీ దోపిడీ ( Robbery ) కు పాల్పడ్డారు. ఏడు కిలోల బంగారంతో పాటు 30 లక్షల నగదును దోచుకెళ్లారు. నగర పోలీస్ కమీషనర్ శ్రీనివాస్, క్లూస్ టీమ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సీసీ కెమేరా ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. Also read: AP: కోవిడ్19 చికిత్సకు టాప్ ప్రయారిటీ

Trending News