జగన్‌కు లోకేష్ సవాల్ ; అవినీతిపై చర్చకు సిద్ధం

                          

Last Updated : Jul 16, 2018, 05:55 PM IST
జగన్‌కు లోకేష్ సవాల్ ; అవినీతిపై చర్చకు సిద్ధం

అమరావతి: టీడీపీ సర్కార్ పై ప్రతిపక్షాలు చేస్తున్న అవినీతి ఆరోపణలపై చర్చకు సిద్ధమని ఏపీ మంత్రి నారా లోకేష్  సవాల్ చేశారు. ప్రశ్నించదల్చుకున్నవారు మీడియా ఎదుట రావాలన్నారు. కావాలనే ప్రతిపక్ష పార్టీ తమ ప్రభుత్వంపై బురదజల్లుతోందన్నారు. ఎన్నికల్లో లబ్దికోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.  ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామని  చెప్పుకుంటున్న జగన్.. హోదా ఇవ్వమంటున్న బీజేపీ, మోడీని ఎందుకు ప్రశ్నించడం లేదో చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు

వైసీపీ ఎంపీలు దద్దమ్మలు
ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ చిత్తుశుద్ధి ఉందని లోకేష్ పేర్కొన్నారు. ఈ అంశంపై వర్షకాల పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నామన్నారు. ఇది చేతగాక వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసి దద్దమ్మల్లా  ఇంట్లో కూర్చుకున్నారని లోకేష్ ఎద్దేవ చేశారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి అంతర్జాతీయ క్రియేటివిటీ సెంటర్‌గా ఎదుగుతుందని..ఆ దిశగా ప్రయత్నాలు జరగుతున్నాయని వెల్లడించారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడతామని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు.

Trending News