Kodali nani: చంద్రబాబుపై మరోసారి విరుచుకపడ్డ మంత్రి కొడాలి నాని

Kodali nani: తెలుగుదేశం ప్రతిపక్ష నేత చంద్రబాబును ఆడిపోసుకోవాలన్నా..ఘాటు విమర్శలు చేయాలన్నా మంత్రి కొడాలి నాని తరువాతే ఎవరైనా. మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపధ్యంలో మరోసారి తీవ్ర విమర్శలు చేశారు కొడాలి నాని. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 14, 2021, 11:45 PM IST
Kodali nani: చంద్రబాబుపై మరోసారి విరుచుకపడ్డ మంత్రి కొడాలి నాని

Kodali nani: తెలుగుదేశం ప్రతిపక్ష నేత చంద్రబాబును ఆడిపోసుకోవాలన్నా..ఘాటు విమర్శలు చేయాలన్నా మంత్రి కొడాలి నాని తరువాతే ఎవరైనా. మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపధ్యంలో మరోసారి తీవ్ర విమర్శలు చేశారు కొడాలి నాని. 

ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని (Kodali nani) తీరే ప్రత్యేకం. ముఖ్యంగా చంద్రబాబును టార్గెట్ చేయడంలో స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్  కాంగ్రెస్ పార్టీ(Ysr congress party) క్లీన్‌స్వీప్ చేయడంతో ఇక చంద్రబాబును టార్గెట్ చేసేందుకు కొడాలి నానికి మంచి ఆయుధం దొరికినట్టైంది. మరోసారి పెద్దఎత్తున విరుచుకుపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నవారే నాయకులవుతారని..అది వైఎస్ జగన్ అని స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో అంశాల్ని 90 శాతం అమలు చేసిన ఘనత జగన్‌కు దక్కుతుందని..అభివృద్ధి, సంక్షేమ పథకాలకే ప్రజలు పట్టం కట్టారన్నారు. ప్రజలకు ఏం కావాలో జగన్‌కు తెలుసని..జగన్‌కు ఏం ఇవ్వాలో ప్రజలకు తెలుసని కొడాలి నాని తెలిపారు. 

40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు (Chandrababu) ఇకనైనా బుద్ది తెచ్చుకోవాలన్నారు. ఎన్నికలకు ముందొక మాట తరువాత ఓ మాట చంద్రబాబుదని అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ను చూసి చంద్రబాబు చాలా నేర్చుకోవాలన్నారు. చంద్రబాబుకు సిగ్గుంటే ఇకనైనా కృష్ణా జిల్లాలలో అడుగు పెట్టకూడదని సూచించారు. అమరావతిలో ఉన్న రైతులను చంద్రబాబు రోడ్డుపైకి తెచ్చారని ..మహిళలను అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ది పొందాలని చంద్రబాబు చూశారని కొడాలి నాని మండిపడ్డారు. ఎల్లో మీడియాలో వస్తున్న విష ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అమరావతి ప్రాంతానికి ఏం కావాలో సీఎం జగన్ ‌(Ap cm ys jagan) దృష్టికి తీసుకువెళ్లమని సూచించారు. నీచ రాజకీయాలు చేసిన చంద్రబాబు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఏం సమాధానమిస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ, ఎల్లో మీడియా కలిసి ఎన్నికల్లో ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మలేదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. 

Also read: Ap Municipal Elections results 2021: విజయవాడ, విశాఖపట్నం కార్పొరేషన్లు వైసీపీ పరం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News