శాసనసభలో ప్రమాణస్వీకారం చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్

షెడ్యూల్ ప్రకారమే ఉదయం 11.05 గంటలకు జాతీయ గీతాలాపనతో ఆంధ్రప్రదేశ్ 15వ శాసనసభ తొలి సమావేశాలు ప్రారంభమయ్యాయి.

Last Updated : Jun 12, 2019, 11:55 AM IST
శాసనసభలో ప్రమాణస్వీకారం చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్

అమరావతి: షెడ్యూల్ ప్రకారమే ఉదయం 11.05 గంటలకు జాతీయ గీతాలాపనతో ఆంధ్రప్రదేశ్ 15వ శాసనసభ తొలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రోటెం స్పీకర్‌గా శంబంగి చినఅప్పలనాయుడు ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రమాణస్వీకారం చేస్తున్నారు. మొదటిగా ఆనవాయితీ ప్రకారమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సభ్యునిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. వారి తర్వాత మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తుండగా ఆ తర్వాత ఇతర శాసన సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Trending News