AP COVID-19: తాజాగా 4,038 కరోనా కేసులు.. 38 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. మూడు వారాల క్రితం నిత్యం పదివేలకు చేరువలో నమోదైన కేసులు కాస్త.. ఇటీవల కాలంలో భారీగా తగ్గుముఖం పడుతున్నాయి.

Last Updated : Oct 15, 2020, 07:30 PM IST
AP COVID-19: తాజాగా 4,038 కరోనా కేసులు.. 38 మంది మృతి

Andhra Pradesh Covid-19 updates: అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. మూడు వారాల క్రితం నిత్యం పదివేలకు చేరువలో నమోదైన కేసులు కాస్త.. ఇటీవల కాలంలో భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా.. గత 24గంటల్లో (  బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9గంటల వరకు ) 73,767 శాంపిళ్లను పరీక్షించగా.. 4,038 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా గత 24 గంటల్లో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్యఆరోగ్యశాఖ ( AP Health Ministry ) గురువారం సాయంత్రం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: Vijayawada Flyover: రేపే కనకదుర్గ ఫ్లై ఓవర్‌ ప్రారంభోత్సవం

తాజాగా నమోదైన కేసులతో.. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,71,503 కి చేరగా.. ఇప్పటివరకు ఈ మహమ్మారితో మరణించిన వారి సంఖ్య 6,357కి చేరింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 40,047 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉండగా.. ఇప్పటివరకు 7,25,099 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 5,622 మంది కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 68,46,040 కరోనా నమూనాలను పరీక్షించినట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇదిలాఉంటే.. జిల్లాల వారీగా కరోనా కేసులు, మరణాల వివరాలు ఇలా ఉన్నాయి..

ap corona bulletin

Also read: Hyderabad Rains: 15కు చేరిన మరణాల సంఖ్య.. కొనసాగుతున్న రెస్క్యూ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News