సింగపూర్ నేవీ నోట.."భారత్ మాతాకీ జై" మాట

భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల సింగపూర్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే

Last Updated : Jun 2, 2018, 08:03 PM IST
సింగపూర్ నేవీ నోట.."భారత్ మాతాకీ జై" మాట

భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల సింగపూర్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఆయన సింగపూర్‌లోని చంగీ నేవల్ బేస్ ప్రాంతాన్ని సందర్శించగా.. అధికారులు ఆయనను సాదరంగా ఆహ్వానించారు. అక్కడ ఆయన కొద్ది సేపు ఇండియన్ నేవీ ఆఫీసర్లతో పాటు రాయల్ సింగపూర్ నేవీ ఆఫీసర్లను కూడా కలిసి ముచ్చటించారు.

ఈ సందర్భంగా భారతీయ సైన్యంతో పాటు రాయల్ సింగపూర్ నేవీ నావికులు మోదీకి వినూత్నంగా స్వాగతం పలికారు. "భారత్ మాతాకీ జై" నినాదాలతో నేవల్ బేస్‌ని హోరెత్తించారు. ఈ సందర్శనకు మోదీతో పాటు సింగపూర్ రక్షణ మంత్రి మహమ్మద్ మాలికి ఓస్మా్న్ కూడా వచ్చారు. ఈ సందర్శన తర్వాత మోదీ ట్వీట్ చేశారు. "భారత్, సింగపూర్ తీర ప్రాంతాల్లో కూడా సంబంధాలను బలోపేతం చేసుకుంటున్నాయి. చంగీ నేవల్ బేస్‌లో ఇరు దేశాల నేవీ అధికారుల మధ్య ఎంత బలమైన బంధం ఉందో చూశాను" అని ట్వీట్ చేశారు. 

Trending News