Ponguleti Srinivas Reddy meets YS Jagan : సీఎం జగన్‌ను కలిసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Ponguleti Srinivas Reddy meets YS Jagan : ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. గతంలో తెలంగాణలో వైఎస్సార్సీపీలో ఉండి ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల ఆ పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన వెళ్లి జగన్‌ని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 

  • Zee Media Bureau
  • Jul 16, 2022, 01:53 PM IST

Ponguleti Srinivas Reddy meets YS Jagan : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. తెలంగాణలో వైఎస్సార్సీపీకి పెద్ద దిక్కుగా వ్యవహరించి ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల ఆ పార్టీపై కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే వార్తల నేపథ్యంలో పొంగులేటి వెళ్లి జగన్‌ని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జగన్‌ల భేటీతో ఖమ్మం జిల్లా రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి.

Video ThumbnailPlay icon

Trending News