Corona Cases: తెలంగాణలో భారీగా పెరుగుతున్న కోవిడ్19 మరణాలు, తాజాగా మరో 29 మంది మృతి

Covid-19 Positive Cases In Telangana | యూఏఈ, కెనడా, బ్రిటన్, న్యూజిలాండ్ లాంటి దేశాలు భారత్‌పై ట్రావెన్ బ్యాన్ విధించిందంటేనే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. తెలంగాణలోనూ కరోనా పాజిటివ్ కేసులతో పాటు కోవిడ్19 మరణాలు పెరిగిపోతున్నాయి. కరోనా బారిన పడి రాష్ట్రంలో మరో 29 మంది మంది మరణించారు.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 23, 2021, 11:13 AM IST
Corona Cases: తెలంగాణలో భారీగా పెరుగుతున్న కోవిడ్19 మరణాలు, తాజాగా మరో 29 మంది మృతి

Telangana Covid-19 Positive Cases: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ రెండో దశ తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. యూఏఈ, కెనడా, బ్రిటన్, న్యూజిలాండ్ లాంటి దేశాలు భారత్‌పై ట్రావెన్ బ్యాన్ విధించిందంటేనే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. తెలంగాణలోనూ కరోనా పాజిటివ్ కేసులతో పాటు కోవిడ్19 మరణాలు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో తాజాగా 6,206 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,79,494కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా గురువారం రాత్రి 8 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 1,05,602 శాంపిల్స్‌కు కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 6 వేల 2 వందల ఆరు మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. తాజా కేసులతో కలిపి తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షల 79 వేల 4 వందల తొంభై నాలుగుకు చేరింది. కరోనా బారిన పడి రాష్ట్రంలో మరో 29 మంది మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,928కి చేరింది. తెలంగాణ సర్కార్ గత కొన్ని రోజులుగా 24 గంటల వ్యవధిలో లక్షకు పైగా కోవిడ్19 నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Also Read: KTR COVID19 Positive: మొన్న సీఎం కేసీఆర్‌కు, నేడు మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటివ్

తెలంగాణలో జీహెచ్ఎంసీలో అత్యధిక కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజా కేసులలో GHMC పరిధిలో 1,005 కరోనా కేసులు నిర్ధారించడం గమనార్హం. రాష్ట్రంలో కొన్ని చోట్ల ఇంకా నిర్లక్ష్యం కనిపిస్తోంది. మాస్కులు ధరించకుండా రోడ్లపై తిరుగుతూ జరిమానాకు గురవుతున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 52 వేల 726 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటివరకూ 1,22,81,027 శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు హెల్త్ బులెటిన్‌లో వెల్లడించారు.

రాష్ట్రంలో నిన్న ఒక్కరోజు చికిత్స అనంతరం కోవిడ్-19 బారి నుంచి 3,052 మంది కోలుకున్నారు. కాగా, తెలంగాణలో ఇప్పటివరకూ మొత్తం 3,24,840 మంది కరోనా మహమ్మారిని జయించారు. భౌతిక దూరం పాటించాలని, అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదని వైద్య శాఖ, వైద్యులు, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్19 నిబందనలు పాటిస్తే కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయవచ్చునని సూచిస్తున్నారు. మొన్న సీఎం కేసీఆర్ కరోనా బారిన పడగా, తాజాగా ఆయన తనయుడు, తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు.

Also Read: Gold Price In Hyderabad 23 April 2021: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు, కొండెక్కిన వెండి ధరలు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News