ప్రధాని మోడీ ముందు కేసీఆర్ ప్రస్తావించిన అంశాలు ఇవే

తెలంగాణ సీఎం కేసీఆర్ తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో సమావేశమయ్యారు

Last Updated : Dec 26, 2018, 07:35 PM IST
ప్రధాని మోడీ ముందు కేసీఆర్ ప్రస్తావించిన అంశాలు ఇవే

ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోడీని కలుసుకున్నారు. సుమారు 40 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. హైకోర్టు విభజన అంశంతో పాటు పెండింగ్ లో ఉన్న రాష్ట్ర పునర్విభజన హామీలు అమలు చేయాలని కేసీఆర్ కోరినట్టు సమాచారం. ఈ సందర్భంగా రాష్ట్రానికి చెందిన పలు అంశాలకు సంబంధించిన వినతపత్నాని ప్రధాని మోడీకి అందించారు. కేసీఆర్ తన వినతిపత్రంలో మొత్తంగా 16 అంశాలను ప్రస్తవించినట్లు తెలిసింది. కేసీఆర్ లేవనెత్తిన అంశాలపై ప్రధాని మోడీ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

కేసీఆర్ ప్రస్తావించిన అంశాలు: 

* విభజన చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాల కోసం రూ. 450 కోట్లు  గ్రాంట్స్ 
* ఏపీ పునర్విభజన చట్టంలో షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన ప్రక్రియ పూర్తి చేయాలి
* ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన కింద నిధుల విడుదల చేయాలని ప్రతిపాదన
*  ప్రతిపాదిత, పెండింగ్ రైల్వే ప్రాజెక్టుల పనుల పూర్తి చేయాలని వినతి
* కరీంనగర్ జిల్లా లో  ట్రిపుల్ ఐటీ ఏర్పాటు
* రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఐఐఎం ఏర్పాటు
* హైదరాబాద్ లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ ఏర్పాటు
* కృష్ణా జలాల వివాదం పరిష్కారానికి చొరవ చూపాలని వినతి
*  సచివాలయం, రహదారి నిర్మాణ పనులకు బైసన్ పోలో గ్రౌండ్ భూముల బదిలీ
* ఆదిలాబాద్ సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా పునరుద్ధరణకు చర్యలు
* కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలి
* ప్రతి జిల్లాకు జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు
* వరంగల్ లో కాకతీయ మెగా టెక్స్ టైట్ పార్క్ అభివృద్ధికి నిధుల విడుదల
* నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ మానుఫాక్చరింగ్ జోన్ (నిమ్జ్) కోసం నిధుల విడుదల
* ఎస్సీ వర్గీకరణ బిల్లు తయారు చేయాలని వినతి
*  వరంగల్ లో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు

 

Trending News