PM Modi: నేను గ్యారంటీ ఇస్తున్నా... రాసుకోండి.. ప్రధాని మోదీ స్పీచ్‌తో దద్దరిల్లిన సభ

PM Modi Speech at BJP Vijaya Sankalpa Sabha: కొంతమంది తనకు కుటుంబం లేదని విమర్శిస్తున్నారని.. 140 కోట్ల మంది భారతీయులు తన కుటుంబమేనని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో దళితుల అభ్యున్నతి కోసం అనేక చర్యలు చేపట్టామని చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు రెండింటిదీ ఒకే బాట అని విమర్శించారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Mar 5, 2024, 01:41 PM IST
PM Modi: నేను గ్యారంటీ ఇస్తున్నా... రాసుకోండి.. ప్రధాని మోదీ స్పీచ్‌తో దద్దరిల్లిన సభ

PM Modi Speech at BJP Vijaya Sankalpa Sabha: రాష్ట్రంలో బీజేపీ పట్ల ఆదరణ పెరుగుతోందని.. ప్రజల ఆశీర్వాదాలు వృథా కానివ్వని ప్రధాని మోదీ అన్నారు. బుధవారం పటాన్​చెరు బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. 'నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు..' అంటూ ప్రసంగం మొదలు పెట్టారు. మోదీ ఏదైతే చెబుతాడో అదే చేసి చూపుతాడని.. మోదీ గ్యారంటీ అంటే.. ఇచ్చిన హామీని నెరవేర్చే గ్యారంటీ అని అన్నారు. భారత్‌ను ప్రపంచంలో సరికొత్త శిఖరాలకు చేర్చాలని.. ఇప్పటికే భారత్‌ ప్రపంచానికి ఆశాకిరణంలా మారిందన్నారు. విదేశాల్లో చాలామంది తెలుగువారు ఉన్నారని.. ప్రపంచ దేశాల్లో తెలుగు ప్రజలు కీలకభూమిక పోషిస్తున్నారని చెప్పారు. తాము ఇచ్చిన మాట ప్రకారం ఆర్టికల్‌ 370ని రద్దు చేశామని గుర్తు చేశారు.

Also Read: అనంత్ అంబానీ ఫంక్షన్ లో రామ్ చరణ్ కి అవమానం.. షారుక్ పై మందిపడుతున్న అభిమానులు

ప్రపంచం గర్వించే రీతిలో అయోధ్యలో రాముడి ప్రతిష్ఠాపన జరిగింది. ఇవాళ మీ అందరికి ఒక గ్యారంటీ ఇస్తున్నా.. రాసుకోండి. ప్రపంచంలో భారతదేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం. కాంగ్రెస్ నేతలు నాపై విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో వారి కుటుంబాలు బాగుపడ్డాయి. కానీ ప్రజలు బాగుపడలేదు. కుటుంబ వాదాన్ని నేను వ్యతిరేకిస్తున్నా. కుటుంబ వాదం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుంది. కుటుంబవాదులకు దోపిడీ చేసే లైసెన్స్ ఉందా..? కొంతమంది నాకు అసలు కుటుంబమే లేదని విమర్శిస్తున్నారు. ఆ నాయకులకు తమ కుటుంబమే ముఖ్యం. నాకు మాత్రం దేశమే ముఖ్యం.. దేశంలో ప్రతి కుటుంబం ముఖ్యం. ఆ నాయకులు దేశంలో అనేకమందిని రాజకీయంగా ఎదగనివ్వలేదు.

యువకులకు కాకుండా వృద్ధులకు మాత్రమే వారు అవకాశం ఇస్తారు. కుటుంబవాదులు తమ ఖజానా నింపుకుంటారు. కొందరు నాయకులు గిఫ్ట్‌లు తీసుకొని ఖజానా నింపుకుంటున్నారు. వారి దొంగసొత్తును బయటకు కక్కిస్తున్నాం. మీరు తలదించుకునేలా చేయబోను. కొందరు నల్లధనం దాచుకోవడానికి విదేశీ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారు. ఓ వర్గం తమ కుటుంబాలకు విలాసవంతమైన కట్టించారు. మేం మాత్రం దేశంలో పేదలకు 4 కోట్ల ఇండ్లు కట్టించాం. అందుకే నాకు కుటుంబం లేదంటూ కొందరు నేతలు విమర్శిస్తున్నారు. 140 కోట్ల మంది భారతీయులు నా కుటుంబం. దేశంలోని ప్రతి చెల్లి, ప్రతి తల్లి నా కుటుంబమే.

ఇండియా కూటమికి ఇది అర్థం కావడంలేదు. అందుకే తాము మోదీ కుటుంబ సభ్యులమని ప్రజలందరూ అంటున్నారు. దేశంలో దళితుల అభ్యున్నతి కోసం అనేక చర్యలు చేపట్టాం. దళితుల సమస్యలు అర్థం చేసుకున్నాం. బీఆర్ఎస్-కాంగ్రెస్ రెండూ ఒకటే. నాణేనికి బొమ్మాబొరుసు లాంటివి. బీఆర్ఎస్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేలకోట్లు దోచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను కొత్త ఏటీఎంగా మార్చుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో బీఆర్ఎస్ ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడితే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవడానికి బదులు ఆ ఫైలును మూసేసింది. ‘మీరు తిన్నారు... మేం కూడా తింటాం’ అన్నట్టుగా రెండు పార్టీల తీరు ఉంది. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు రెండింటిదీ ఒకే బాట.. ఝూట్‌.. లూట్‌ (అబద్ధాలు.. దోపిడీ). రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలవడమే లక్ష్యంగా బీజేపీ శ్రేణులు పనిచేయాలి.." అని ప్రధాని మోదీ అన్నారు. 

Also Read: Cobra Snake: ధైర్య సాహసాలతో మనుమరాలిని కాపాడిన నాన్నమ్మ నాగుపాముకు బలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News