గ్రూప్ 2 జాబితాలో తప్పులు దొర్లాయ్..

తక్కువ మార్కుల వచ్చిన వారు ముందు వరసలో ఉన్నట్లు అభ్యర్ధుల నుంచి ఏపీపీఎస్సీకి ఫిర్యాదులు అందాయి.   

Last Updated : Dec 20, 2017, 09:23 AM IST
గ్రూప్ 2 జాబితాలో తప్పులు దొర్లాయ్..

గ్రూప్ 2 జాబితాలో తప్పులు దొర్లాయ్. తక్కువ మార్కుల వచ్చిన వారు ముందు వరసలో ఉన్నట్లు అభ్యర్ధుల నుంచి ఏపీపీఎస్సీకి ఫిర్యాదులు అందాయి. వివారాల్లోకి వెళ్లినట్లయితే గ్రూప్ 2  ఉద్యోగాల భర్తీ కోసం ఎంపికైన అభ్యర్ధులకు సంబంధించి ధ్రువపత్రాల పరిశీలన చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి తొలి జాబితా ఏపీపీఎస్సీ సిద్ధం చేసింది. జాబితాలో ఉన్న 1925 మందికి వచ్చే నెల 3 నుంచి 20వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన  చేస్తున్నట్లు ఏపీపీఎస్పీ ప్రకటించింది. ఈ జాబితాను పరిశీలించిన అభ్యర్ధులు తక్కువ మార్కుల వచ్చిన వారు ముందు వరులో ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని  ఏపీపీఎస్సీకి ఫిర్యాదులు చేశారు. తమనకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా అభ్యర్ధులు కోరారు. 

;పొరపాటు ఇదే..

అభ్యర్ధుల జాబితాలో ఉన్న నెంబర్లను అనుసరించి మార్కులపరంగా పరిశీలించగా తప్పులు వెలుగులోకి వచ్చాయి. ప్రాధామిక సమాచారం ప్రకారం వైకల్యం, మాజీ సైనికోద్యోగుల కోటాలో ఎంపిక చేసిన అభ్యర్ధులకు రిజర్వేషన్ వర్తింపు వ్యవహారంలో పొరపాట్లు దొర్లినట్లు తెలిసింది. ఇది అభ్యర్ధులకు తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కాగా ఈ అంశాన్ని ఏపీపీఎస్సీ పరిశీలిస్తోంది.

Trending News