పాట్నా జంక్షన్ రైల్వే స్టేషన్లో పెద్ద మొత్తంలో బంగారం (Gold), నగదు (Cash) పట్టుబడింది. శనివారం పాట్నా జంక్షన్ రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి నుంచి 18 కిలోల బంగారం, రూ.2.30 లక్షల నగదును రైల్వే పోలీసులు (GRP) స్వాధీనం చేసుకున్నారు.
కేంద్ర మంత్రి, లోక్ జన శక్తి పార్టీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ ( Ram Vilas Paswan ) నిన్న అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. 74ఏళ్ల పాశ్వాన్కు ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అక్టోబరు 4న గుండెకు ఆపరేషన్ జరిగింది.
బీహార్లో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే మొదటి విడత ఎన్నికలకు (Bihar Assembly election 2020) నోటిఫికేషన్ వెలువడటంతో రాష్ట్రంలో రాజకీయ వేడి ప్రారంభమైంది. ఈ క్రమంలో మహాకూటమి దళానికి (RJD-Congress-Left) శుభవార్త వచ్చినట్టే వచ్చి.. మళ్లీ నిరాశలో మునిగేలా చేసింది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ (NDA) భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జేడీయూ మధ్య సీట్ల పంపకం పూర్తయింది. ఈ కూటమికి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సారథ్యం వహించనున్నారు. అందరూ ఊహించినట్లుగానే 50:50 సీట్లను బీజేపీ, జేడీయూ పంచుకున్నాయి.
బీహార్ ఎన్నికల వేడి ప్రారంభమైంది. మూడు విడతల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు మొదటివిడత నామినేషన్ ప్రక్రియ మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. అయితే మహాకూటమి (Congress, RJD, Left) పార్టీల మధ్య సీట్ల పంపకం నిన్ననే పూర్తయింది. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర అధికార పార్టీలైన జేడీయూ, బీజేపీ ( JDU- BJP) మధ్య సీట్ల ఒప్పందం కుదిరినట్లు సమాచారం.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల మహా సంగ్రామం ప్రారంభమైంది. రాష్ట్రంలోని 243 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 28, నవంబర్ 3,7 తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.
BJP leader Shot Dead In Bihar | బిహార్లో రాజకీయ వేడి మొదలైంది. ఇప్పుడిప్పుడే కూటములు, ప్రచారాలకు సిద్ధమవుతుండగానే భారతీయ జనతా పార్టీ (BJP)కి చెందిన నేత దారుణహత్యకు గురయ్యారు.
దేశవ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus) విలయతాండవం చేస్తోంది. ఈ క్రమంలో బీహార్ ఎన్నికల (Bihar Assembly Elections) పై నెలకొన్న సందిగ్ధత వీడింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను శుక్రవారం ప్రకటించింది. మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం (CEC) వెల్లడించింది.
బీహార్ కు చెందిన ఒక విద్యార్థి కొన్ని నెలల నుంచి NEET పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్నాడు. అయితే 10 నిమిషాలతో ఎగ్జామ్ మిస్ అయ్యాడు. ఈ విద్యార్థి పేరు సంతోష్ కుమార్ యాదవ్.
కేంద్ర మాజీ మంత్రి, ఆర్జేడీ మాజీ నాయకుడు రఘువంశ్ ప్రసాద్ సింగ్ (74) కన్నుమూశారు. ఢిల్లీలోని ఏయిమ్స్లో చికిత్స పొందుతున్న రఘువంశ్ ప్రసాద్ (Raghuvansh Prasad) ఆరోగ్యం మరింత క్షీణించడంతో.. శనివారం ఆయన్ను వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.
బీహార్ ఎన్నికల్లో పోటీ గురించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ( Jagat Prakash Nadda ) కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) సారథ్యంలోభారతీయ జనతా పార్టీ (BJP), జనతాదళ్ యునైటెడ్ (JDU), లోక్ జనశక్తి పార్టీ (LJP) కలిసి పోటీ చేస్తాయని నడ్డా స్పష్టంచేశారు.
దేశవ్యాప్తంగా కరోనావైరస్ ( Coronavirus ) విలయతాండవం చేస్తోంది. సాధరణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు సైతం కరోనా బారిన పడుతున్నారు. దీంతోపాటు వారికి రక్షణగా ఉండే పోలీసు సిబ్బంది కూడా కరోనాకు గురవుతున్నారు.
బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ (Sushant death case) అనుమానాస్పద మృతి కేసులో సుప్రీంకోర్టు ( supreme court ) కీలక తీర్పు వెలువరించింది. ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. బీహార్ ముఖ్యమంత్రి వినతి మేరకు ఇప్పటికే ఈ కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐకీ అప్పగించిన విషయం మనందరికీ తెలిసిందే.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసును సీబీఐకి ( CBI ) అప్పగించాల్సిందిగా బీహార్ సర్కార్ చేసిన విజ్ఞప్తిని అంగీకరిస్తున్నట్టు కేంద్రం స్పష్టంచేసింది. ఇదే విషయాన్ని బుధవారం సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్రం తరపున సుప్రీం కోర్టుకు తెలియజేశారు.
బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ( sushant singh rajput ) కేసు విచారణ రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే అనేక రాజకీయ పరిణామాలు జరిగిన సుశాంత్ ఆత్మహత్య కేసులో తాజాగా మరో వివాదాస్పద పరిణామం తెరపైకివచ్చింది.
కరోనా వైరస్ ( Corona virus ) మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. దేశంలో కోవిడ్ 19 కేసులు ( Covid19 cases ) ఒక మిలియన్ మార్కును దాటేశాయి. ఈ నేపధ్యంలో ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ ( Famous medical Journal The lancet ) దేశంలోని అత్యధిక ప్రమాదకర జిల్లాలున్న రాష్ట్రాల జాబితాను విడుదల చేసింది. ఆ రాష్ట్రాలు ఇవే.
lightning strikes | ఉరుములు, మెరుపులతో కురుస్తున్న భారీ వర్షాలు ఆ రాష్ట్రాల ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. శనివారం పిడుగులు పడి ఆయా రాష్ట్రాల్లో 43మంది మరణించగా.. అనేక మంది గాయాలపాలయ్యారు. చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
బీహార్ రాష్ట్రానికి చెందిన దంపతులు ఉపాధి కోసం పది నెలల క్రితం ఘజియాబాద్ కు వచ్చారు. వీరిద్దరూ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఘజియాబాద్ లోని ఇందిరాపురంలో శుక్రవారం చోటు చేసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.