Bandi Sanjay on The Kerala Story Movie: సీఎం కేసీఆర్ కూడా ది కేరళ స్టోరీ మూవీ చూడాలని బండి సంజయ్ కోరారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాలో చూపించిన తరహా సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు. ఈ మూవీలో చూపించింది 5 నుంచి 10 శాతమేనని పేర్కొన్నారు.
BJP Delhi: తెలంగాణ కమలదళం ఢిల్లీ పెద్దలనే నమ్ముకుందా?.. ఢిల్లీ పెద్దలు కూడా ఇక్కడి నేతలతో పని కాదని అనుకున్నారా? అందుకే పదే పదే రాష్ట్రంలో పర్యటిస్తున్నారా? నెలకోసారి ప్రధాన్ టూర్ అందుకేనా? అని అందరిలోనూ అనుమానాలు నెలకొన్నాయి.
పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఎమ్మెల్యే ఈటల బృందం భేటీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్పందించారు. ఈ సమావేశం గురించి తనకు సమాచారం లేదన్నారు. తనకు చెప్పకపోవడం తప్పేమికాదన్నారు. ఎవరి పని వాళ్లు చేసుకుని వెళతారని అన్నారు.
Protest Against Ban on Bajarang Dal: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పీఎఫ్ఐపై నిషేధం ఎత్తేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ భజరంగ దళ్ను నిషేధిస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం దుర్మార్గం. ఈ విషయంపై దేశవ్యాప్తంగా హిందూ సమాజం ఎంతో ఆగ్రహంతో ఉంది అని బండి సంజయ్ అన్నారు.
TSRTC Chairman Bajireddy Govardhan: ఇప్పటివరకు తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ 4.50 లక్షల కోట్ల మేర ఖర్చు చేశారు. మరి అదే రైతుల కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఏం చేస్తున్నారో బండి సంజయ్ ప్రశ్నించాలని టిఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ అన్నారు. బండి సంజయ్కి తెలివితేటలు ఉంటే రైతులకు అదనంగా మరో పది వేలు ఇప్పించాలి అని బాజిరెడ్డి గోవర్థన్ డిమాండ్ చేశారు.
Bandi Sanjay Speech from Karnataka Election 2023 Campaign: అదేంటి ఒక్క దెబ్బకు రెండు పిట్టలే అంటారు కదా.. మరి ఈ మూడు పిట్టలు ఏంటి అనుకుంటున్నారా ? కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్ ప్రసంగం వింటే ఈ మూడు పిట్టల కథేంటో మీకే అర్థం అవుతుంది. అదేంటో మేం చెబుతాం రండి.
Bandi Sanjay in Karnataka Elections Campaign: బండి సంజయ్ రూట్ మార్చారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల రంగంలోకి దిగారు. అక్కడ అభ్యర్థుల విజయానికి జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ను ఓడించి.. బీజేపీకి ఓటేయ్యాలంటూ ఓటర్లను కోరుతున్నారు.
Bandi Sanjay's Bail: బండి సంజయ్ బెయిల్ పై బయట ఉంటే, టెన్త్ పేపర్ లీకేజీ స్కామ్ కేసుతో సంబంధం ఉన్న నిందితులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున బండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు.
Revanth Reddy Speech From Adilabad Meeting : తెలంగాణ విద్యార్థులకు ఉద్యమించి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడం తెలుసు.. అలాగే తెలంగాణ యువకులకు నిటారుగా నిలబడి కొట్లాడటం తెలుసు అని అన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.
Bandi Sanjay Speech At BJP Unemployment March: రాష్ట్రంలో పేపర్ల లీకేజీకి కేసీఆర్ కుటుంబమే కారణమని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్కు కౌంట్ డౌన్ స్టార్టయిందని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో నిరుద్యోగ మార్చ్ నిర్వహించారు.
Bandi Sanjay Speech At Vijay Sankalp Sabha: తెలంగాణలో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు బండి సంజయ్. అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. ఉచిత విద్య, వైద్యం అందిస్తామని చెప్పారు.
KTR Satires On Amit Shah's Speech: అమిత్ షా వ్యాఖ్యలపై ట్విటర్ ద్వారా స్పందించిన మంత్రి కేటీఆర్.. అమిత్ షా ప్రస్తావించిన అంశాలనే గుర్తుచేస్తూ ఆ అంశాలకు విరుద్ధ వ్యాఖ్యలతో సెటైర్లు వేశారు. డీయర్ అమిత్ షా జీ అంటూ మొదలుపెట్టిన కేటీఆర్.. " బీజేపి త్వరలో అధికారంలోకి కాదు.. అంధకారంలోకే వెళ్తుంది" అని అన్నారు.
Etela Rajender Vs Revanth Reddy: కాంగ్రెస్పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ సమర్థించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏడ్వటంలో తప్పులేదని.. నిజంగా బాధ ఉంటేనే ఏడుపు వస్తుందన్నారు.
Revanth Reddy To Etela Rajender: “రాజీ నా రక్తంలో లేదు.. భయం నా ఒంట్లో లేదు.. ఆఖరి రక్తపు బొట్టు వరకు నేను సీఎం కేసీఆర్తో పోరాటం చేస్తా.. అమ్మవారిపై ప్రమాణం చేసి చెబుతున్నా... మునుగోడు ఎన్నికల్లో కేసీఆర్, టీఆర్ఎస్ నుంచి డబ్బులు తీసుకుని ఉంటే... నా కుటుంబం సర్వ నాశనమైపోతుంది” అని చెబుతూ తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు.
Bandi Sanjay : చేవెల్లలో జరగాల్సిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా విజయ సంకల్ప సభ సంచలన కావాలని బండి సంజయ్ అన్నారు. లక్షకు పైగా కార్యకర్తలు హాజరవ్వాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. నేతలందరితోనూ బండి సంజయ్ సమీక్షలు జరిపారు.
Amit Shah Meeting In Chevella: తెలంగాణలో కేంద్ర మంత్రి అమిత్ షా టూర్ను సూపర్ సక్సెస్ చేసేందుకు రాష్ట్ర బీజేపీ నాయకత్వం రెడీ అవుతోంది. ఈ మేరకు నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు బండి సంజయ్. చేవెళ్ల సభకు భారీ జనసమీకరణ చేయాలని పిలుపునిచ్చారు.
Karimnagar Hasanparthy Railway Line: కరీంనగర –హసన్పర్తి కొత్త రైల్వే లేన్ నిర్మాణానికి కేంద్ర నుంచి ఆమోదం లభించింది. వెంటనే రీ సర్వే చేసి నివేదిక సమర్పించాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే రైల్వే లేన్ నిర్మాణానికి అడుగులు పడనున్నాయని తెలిపారు బండి సంజయ్.
Bandi Sanjay Write Letter To CM KCR: సీఎం కేసీఆర్కు బండి సంజయ్ లేఖ రాశారు. నిర్మల్ పట్టణంలో ఈద్గా నిర్మాణం కోసం భూమి కేటాయించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా భూమి కేటాయించడాన్ని ఆయన తప్పుబట్టారు. హిందూ ఆలయాలకు సమీపంలో ఈద్గా ప్రార్థనలకు భూమి కేటాయించడం సరికాదన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.