కోహ్లీసేన ఓటమిపై ప్రధాని మోడీ ఆసక్తికర రియాక్షన్ !!

వరల్డ్ కప్‌ సెమీస్ ఫైనల్ మ్యాచ్ లో కోహ్లీసేన ఓటమి అభిమానులకు తీవ్ర నిరాశకు గురిచేసింది.

Last Updated : Jul 10, 2019, 11:32 PM IST
కోహ్లీసేన ఓటమిపై ప్రధాని మోడీ ఆసక్తికర రియాక్షన్ !!

వరల్డ్ కప్ ఫైనల్లో కివీస్ చేతిలో కోహ్లీ సేన అన్యూహంగా ఓటమి టీమిండియా అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. ఓటమిని తట్టుకోలేక కొందరైతే భావోద్వేగాలకు గురయ్యారు. టోర్నీ మొదలు నుంచి అద్భుత ప్రదర్శన చేసి టీమిండియా సెమీస్ చతికిలపడటం ఏంటని కొందరు ఆశ్చర్యానికి వ్యక్తం చేశారు. 

తాజాగా టీమిండియా ఓటమిపై భారత ప్రధాని మోడీ స్పందించారు. ఆట అన్నాక గెలుపోటములు సహజం అన్న ప్రధాని...మ్యాచ్ లో చివరి వరకు పోరాడిందంటూ టీమిండియాపై ప్రసంశించారు. మ్యాచ్ ఫలితం అసంతృప్తి కలిగించినా టీమిండియా కడవరకు పోరాడిన తీరు అకట్టుకుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

 

 

Trending News