ఉద్వేగంతో ఉక్కిరిబిక్కిరైన క్రికెటర్ ధోని..!

క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్‌కింగ్స్‌ ఫ్రాంఛైజీ నిర్వాహకులు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతున్న సందర్భంలో ఎంతో భావోద్వేగానికి గురయ్యాడు.

Last Updated : Mar 30, 2018, 01:07 PM IST
ఉద్వేగంతో ఉక్కిరిబిక్కిరైన క్రికెటర్ ధోని..!

క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్‌కింగ్స్‌ ఫ్రాంఛైజీ నిర్వాహకులు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతున్న సందర్భంలో ఎంతో భావోద్వేగానికి గురయ్యాడు.

"నిషేధం వల్ల రెండేళ్లు సొంత జట్టుకి దూరమయ్యాను. ఈ క్రమంలో పూణె సూపర్ జెయింట్స్ తరఫున ఆడాను. ఇప్పడు మళ్లీ నా జట్టుకే ఆడుతున్నాను. ఇవి చాలా ఉద్వేగభరితమైన క్షణాలు. నాకు ఈ జట్టుతో ఉన్న బంధం చాలా ప్రత్యేకమైంది. టీమిండియా తరఫున 89 మ్యాచ్‌లు ఆడితే.. ఈ జట్టు తరఫున ఇప్పటికి 159 మ్యాచ్‌లు ఆడాను. మళ్లీ ఎల్లో జెర్సీ ధరించాల్సి రావడం నాకు సంతోషకరమైన విషయం" అని ధోని తెలిపాడు.

ప్రస్తుతం ధోని చేసిన ఈ ప్రసంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగానే చక్కర్లు కొడుతోంది. ఏప్రిల్ 7వ తేది నుండి ఐపీఎల్ ప్రారంభమవుతుందన్న విషయం మనకు తెలిసిందే.

ఈ టోర్నిలో తొలి మ్యాచ్‌లోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ముంబయి ఇండియన్స్ లాంటి గట్టి ప్రత్యర్థితో తలపడనుంది. వాంఖడే స్టేడియం ఈ మ్యాచ్‌కి వేదిక కానుంది. రెండేళ్ళ నిషేధాన్ని ముగించుకుని ఈ సంవత్సరం చెన్నై సూపర్‌కింగ్స్‌, రాజస్థాన రాయల్స్‌ మళ్లీ ఐపీఎల్ బరిలోకి దిగనున్నాయి. స్పాట్ ఫిక్సింగ్‌తో పాటు పలు ఇతర ఆరోపణలతో ఈ రెండు జట్లపై గతంలో సుప్రీం కోర్టు రెండేళ్లు బ్యాన్ విధించింది.

అయితే ఈ ఐపీఎల్‌లో 100 ట్రాక్ రికార్డు ఉన్న ఆటగాడిగా ధోనికున్న ఫాలోయింగ్.. మరి చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కు ఛాంపియన్ షిప్ తీసుకొచ్చి పెడుతుందో లేదో తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే

Trending News