Air India: ఏయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ బంపర్‌ బొనాంజా.. రూ. 1,947 కే విమాన ప్రయాణం..

Air India Express Freedom Sale: విమాన ప్రయాణం చేయాలని కలలు కనేవారికి ఏయిర్‌ ఇండియా బంపర్‌ ఆఫర్ ప్రకటించింది. ఫ్లైట్‌ టిక్కెట్‌ ధర కేవలం రూ. 1,947 కే విమాన టిక్కెట్టును అందుబాటులో ఉంచింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏయిర్‌ ఇండియా ప్రయాణీకులకు ఈ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ విషయాన్ని ఏయిర్‌ ఇండియా తన అధికారిక ఎక్స్‌ వెబ్‌సైట్‌లో పోస్టు చేసింది. దీనికి ఫ్రీడం సేల్‌ అని నామకరణం చేసింది.  

2 /5

ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏయిర్‌ ఇండియా విమాన ప్రయాణీకులకు బంపర్‌ బొనాంజా ప్రకటించింది. టిక్కెట్టు ధరను కేవలం రూ.1947 నుంచి అందుబాటులో పెట్టింది. ఈ ఆఫర్ మూడు రోజులపాటు బుక్‌ చేసుకోవచ్చు. దీంతో సెప్టెంబర్‌ 30 వరకు ప్రయాణం చేయవచ్చు.  

3 /5

ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ టిక్కెట్లు బుక్‌ చేసుకోవాలనుకుంటే ఏయిర్‌ ఇండియా వెబ్‌సైట్‌లో బుక్‌ చేసుకోవచ్చు. లగేజీ చెక్‌ ఇన్‌ కోసం ముందుగానే 3 కేజీల వరకు కూడా ముందుగానే బుక్‌ చేయవచ్చు. అయితే, 20 కేజీల లగేజీ వరకు రూ. 1300 చెల్లించాల్సి ఉంటుంది. ఇది అంతర్జాతీయంగా ఒక వేళ మీరు దేశీ ప్రయాణం చేయాలనుకుంటే 15 కేజీల లగేజీకి వెయ్యి రూపాయాలు చెల్లించాలి.   

4 /5

ఏయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభించిన ఈ ఆఫర్ పరమిత ఆఫర్ ముందుగా బుక్ చేసుకున్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. రిజర్వ్‌ చేసిన సీట్టు అమ్ముడైతే సాధారణ ఫ్లైట్‌ టిక్కెట్ల ధరలు వర్తిస్తాయి. అయితే, పేమెంట్‌ తర్వాత రీఫండ్‌ కూడా ఉండదు.  

5 /5

ఈ రిజర్వ్‌ చేసిన టిక్కెట్లను ఇతరులకు ట్రాన్సఫర్ కూడా చేయకూడదు. ఈ స్పెషల్‌ సేల్‌ గురించిన మరిన్ని వివరాలు ఏయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్నాయి.ఇందులో అంతర్జాతీయంగా 15, దేశీయంగా 32 గమ్యస్థానాలకు ఏయిర్‌ ఇండియా ప్రయాణం అందుబాటులో ఉంది.