Bigg Boss 7 Telugu latest Promo: బిగ్ బాస్ సీజన్ 07 ఊహించని ట్విస్టులతో సాగుతోంది. మూడో పవరాస్త్ర కోసం ఎంపిక చేసిన ముగ్గురు కంటెస్టెంట్లు తెగ కష్టపడుతున్నారు. ఇప్పటికే ప్రిన్స్ యావర్ కంటెండర్ గా నిరూపించుకోగా.. ఇప్పుడు శోభా శెట్టి, అమర్ దీప్ వంతు వచ్చింది. ముందుగా శోభా శెట్టిని కంటెండర్కు అర్హురాలని నిరూపించుకునేందుకు అత్యంత కారంగా ఉన్న చికెన్ తినే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. దీంతో కారంగా ఉన్న చికెన్ తినేందుకు రెడీ అయింది శోభా. కారం మరి ఎక్కువ ఉండటంతో ఆమె తట్టుకోలేకపోయింది. కొన్ని పీసెస్ తిని పూనకం వచ్చినట్లు ఊగిపోయింది. నా జీవితంలో ఇంత కారం తినలేదంటూ తల పట్టుకుని టేబుల్ పై పడిపోయింది. మమ్మీ అంటూ ఏడ్చింది. ఆ ఘూటను తట్టుకోలేక టిష్యు పేపర్లను నోట్లో పెట్టుకుంది శోభా. ఇక తినలేక అక్కడి నుంచి వెళ్లిపోయింది.
శోభా టాస్క్ చేయడంలో విఫలమవడంతో.. కంటెండర్కు అనర్హురాలని చెప్పిన శుభ శ్రీ, గౌతమ్, ప్రశాంత్ను కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచాడు బిగ్ బాస్. గిన్నెలో ఉన్న మెుత్తం చికెన్ను ముందుగా ఎవరు తింటారో వారు శోభా శెట్టి స్థానంలో కంటెండర్ అవుతారని బిగ్ బాస్ చెబుతాడు. దీంతో ముగ్గురు చికెన్ లాగించడం మెుదలుపెడతారు. ఈ టాస్క్ కు సందీప్ సంచాలకుడిగా వ్యవహారిస్తాడు. ప్రశాంత్ తినడం చూసి.. వాడే తినేస్తాడని శోభా చెప్పడం ప్రోమోలో(BB 7 latest Promo) చూపించారు మేకర్స్. మరి ఈ టాస్క్లో గెలిచి కంటెండర్గా ఎవరు ఎంపికయ్యారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ వరుకు వేచి చూడాల్సిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook