అంధత్వ వృద్ధురాలిపై అత్యాచారం

మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. అంధత్వం ఉన్న వృద్ధురాలిపై కొంత మంది దుండగులు అత్యాచారం చేసి పారిపోయారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని షాపూర్‌లో ఈ దారుణం జరిగింది.

Last Updated : Apr 18, 2020, 08:50 AM IST
అంధత్వ వృద్ధురాలిపై అత్యాచారం

మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. అంధత్వం ఉన్న వృద్ధురాలిపై కొంత మంది దుండగులు అత్యాచారం చేసి పారిపోయారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని షాపూర్‌లో ఈ దారుణం జరిగింది. 

భోపాల్‌లోని షాపూర్‌లో నివసిస్తున్న 53 ఏళ్ల మహిళ.. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో..కొంత మంది దుండగులు ఇంట్లోకి ప్రవేశించారు. ఆమెకు కళ్లు కనిపించని కారణంగా .. వారిని గుర్తించలేకపోయింది. ఆ తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారం చేసి దుండగులు పారిపోయారు. ఆమె బ్యాంకు అధికారిగా  పని చేస్తోంది. ఆమె భర్త, పిల్లలు కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా రాజస్థాన్‌లో చిక్కుకుపోయారు. 

పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి క్లూ లభించలేదని పోలీసులు తెలిపారు. ఐతే త్వరలోనే వారిని పట్టుకుంటామని చెప్పారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News