Road Accident: ఆరు ప్రాణాలను మింగిన పొగమంచు.. రోడ్డు ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలు?

Road Accident In Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరగగా ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందగా, 15 మంది ప్రయాణికులు గాయపడ్డారని తెలుస్తోంది. 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 30, 2022, 10:33 AM IST
 Road Accident: ఆరు ప్రాణాలను మింగిన పొగమంచు.. రోడ్డు ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలు?

Road Accident In Uttar Pradesh's Bahraich: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది, ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందగా, 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. హుటాహుటిన క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించారు. ఇక ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం, జైపూర్ నుండి బహ్రైచ్‌కు వస్తున్న ఈద్గా డిపో బస్సు బహ్రైచ్-లక్నో హైవేపై బుధవారం ఉదయం జర్వాల్ రోడ్‌లోని ఘఘ్రాఘాట్ స్టేషన్ సమీపంలో ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఢీకొన్న తాకిడికి బస్సు వెనుక భాగం పూర్తిగా దెబ్బతిందని అంటున్నారు.

ఇక  ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా 15 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న జర్వాల్ పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులందరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఘోర రోడ్డు ప్రమాదం సమాచారం అందిన వెంటనే జిల్లా మెజిస్ట్రేట్ డాక్టర్ దినేష్ చంద్ర, ఎస్పీ కేశవ్ కుమార్ చౌదరి, ఉన్నతాధికారులతో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇక ట్రక్కు డ్రైవర్‌తో సహా ఆరుగురు వ్యక్తులు ఘోర రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు చెబుతున్నారు. అదే సమయంలో ఈ ప్రమాదంలో 15 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. వీరిలో అరడజను మంది పరిస్థితి విషమంగా ఉందని, ఈ పరిస్థితుల్లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

జిల్లా మెజిస్ట్రేట్ డాక్టర్ దినేష్ చంద్ర మాట్లాడుతూ ఉదయం హృదయ విదారక ప్రమాదం జరిగిందని, జైపూర్ నుంచి వస్తున్న ఈద్గా డిపో బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందారు. 15 మంది గాయపడ్డారని అన్నారు.  పోలీసు సిబ్బంది అందరినీ రక్షించి ఆసుపత్రికి తరలించారని, క్షతగాత్రులకు అన్ని విధాలా సాయం అందించాలని అధికారులందరికీ సూచించామని అన్నారు. ఇక  ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు బృందం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. బహ్రైచ్‌లోని జర్వాల్ ప్రాంతంలోని తపేసిపా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.  

ఉత్తరప్రదేశ్‌లో చలి ఇంకా తారాస్థాయికి చేరుకోలేదని, కానీ పొగమంచు మాత్రం దట్టంగా అలుముకుంటోంది. జర్వాల్ ప్రాంతంలోని తపేసిపాలో తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో ఈ భీకర ప్రమాదం జరిగింది. ఈ బస్సు జైపూర్ నుంచి బహ్రైచ్‌కు వస్తోందని సంఘటనా స్థలంలో ఉన్న జిల్లా అధికారి డాక్టర్ దినేష్ చంద్ర తెలిపారు. ఆ తర్వాత ఉదయం రాంగ్ డైరెక్షన్ లో వస్తున్న ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పూర్తిగా వివరాలు బయటకు రాకున్నా ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదం పొగమంచు కారణంగా డ్రైవర్లిద్దరూ ఒకరినొకరు చూడలేక జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అయితే వెలువడాల్సి ఉంది. 

Also Read: మందేసి బండెక్కిన యువతి, మరో అమ్మాయితో కలిసి ఇంటికి తీసుకెళ్లి డ్రైవర్ గ్యాంగ్ రేప్?

Also Read:  వింత ప్రేమ.. నలుగురు ముసలోళ్లతో ‘ఆంటీ’ లవ్.. ఐదో వ్యక్తి ఎంట్రీతో సంచలనం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News