గుజరాత్ ఎన్నికల ఫలితాలపై మమతా రియాక్షన్

గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. 

Last Updated : Dec 18, 2017, 10:28 PM IST
గుజరాత్ ఎన్నికల ఫలితాలపై మమతా రియాక్షన్

గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. గుజరాత్ లో బీజేపీ గెలిచి పరువు కాపాడుకుందని అన్నారు. 

"చాలా సమతుల్యంగా తీర్పు నిచ్చిన గుజరాత్ ఓటర్లకు అభినందనలు. ఇది ఒక తాత్కాలిక విజయం. పరువు కాపాడుకుంది అంతే. కానీ బిజెపికిది నైతిక ఓటమి. సాధారణ ప్రజలకు చేసిన అకృత్యాలకు, అన్యాయాలకు వ్యతిరేకంగా గుజరాత్ ప్రజలు ఓటువేశారు" అని మమతా ట్విట్టర్ లో పేర్కొన్నారు. 

 

2014 లోక్ సభ ఎన్నికలలో పార్టీ విజయం తర్వాత మమతా బెనర్జీ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. తాజా గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలతో కమలం పార్టీ ఆనందంలో మునిగిపోయింది. అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది.

Trending News