యడియూరప్ప కేబినెట్లో 17 మందికి చోటు; మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారి జాబితా ఇదే

కర్నాటకలో  కొత్త ప్రభుత్వాన్ని నడిపించేందుకు ముఖ్యమంత్రి యడియూరప్ప కేబినెట్ విస్తరణకు శ్రీకారం చుట్టారు. ఈ దఫా కేబినెట్ లో 17 మందికి చోటు కల్పించారు.   

Last Updated : Aug 20, 2019, 01:36 PM IST
 యడియూరప్ప కేబినెట్లో 17 మందికి చోటు; మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారి జాబితా ఇదే

కర్ణాటకలో ముఖ్యంత్రి బీఎస్ యడియూరప్ప సాధర్యంలో కొత్తగా ఏర్పడిన  కేబినెట్లో  17 మంది చోటు దక్కింది. కాగా కేబినెట్  మంత్రులుగా ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు. బెంగళూరులోని రాజ్ భవన్ లో వీరందరి చేత గవర్నర్ వాజూభాయ్ వాలా ప్రమాణస్వీకారం చేయించారు. యడియూరప్ప కేబినెట్ లో గాలి జనార్దన్ రెడ్డి ముఖ్య అనుచరుడు ముద్రపడ్డ శ్రీరాములుగా కూడా ప్రమాణస్వీకారం చేయడం గమనార్హం . కాగా ఇందులో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే హెచ్.నగేశ్ కూడా కేబినెట్ బెర్త్ లో చోటు దక్కింది.

కేబినెట్ జాబితా ఇదే
కేబినెట్ లో చోటు దక్కించుకొని ప్రమాణస్వీకారం చేసిన వారిలో జగదీష్ శెట్తార్, వి సోమన్న, బసవరాజ్ బొమ్మాయి, జెసి మధుస్వామి, శశికళ జోల్లె, లక్ష్మణ్ సావాడి, సిసి పాటిల్, ఆర్ అశోక్, సిటి రవి, డాక్టర్ సిఎన్ అశ్వత్నారాయణ్, ప్రభు చౌహాన్, గోవింద్ కార్జోల్, హెచ్ నాగేష్, కెఎస్ ఈశ్వరప్ , ఎస్ సురేష్‌కుమార్ తదితరులు ఉన్నారు. తొలి దశ కేబినెట్ విస్తరణలో భాగంగా సీఎం యుడియూరప్ప ఈ మేరకు కేబినెట్ మంత్రులను ఎన్నుకున్నారు

Trending News