రూ.1,177కే విమాన సేవలు ప్రారంభించిన జెట్ ఎయిర్‌వేస్

పలు ప్రత్యేక మార్గాల మధ్య రూ.1,177కే విమాన సేవలు

Last Updated : Jun 15, 2018, 04:10 PM IST
రూ.1,177కే విమాన సేవలు ప్రారంభించిన జెట్ ఎయిర్‌వేస్

జెట్ ఎయిర్‌వేస్ ఎన్నిక చేసుకున్న పలు ప్రత్యేక మార్గాల మధ్య రూ.1,177కే విమాన సేవలు అందిస్తున్నట్టు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకం కింద ఎంపికైన మార్గాల్లోనే ఈ ధరలు వర్తించనున్నట్టు జెట్ ఎయిర్‌వేస్ స్పష్టంచేసింది. ప్రాంతీయ నగరాలు, పెద్ద నగరాలకు మధ్య సేవలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన రీజినల్ కనెక్టివిటీ స్కీమ్ (ఆర్సీఎస్) ప్రకారమే జెట్ ఎయిర్‌వేస్ ఈ కొత్త మార్గాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. సామాన్యుడికి విమానయానం అందుబాటులోకి తీసుకురావాలనే ఉడాన్ పథకాన్ని అనుసరించే తాము ఈ సేవలు ప్రాంరభిస్తున్నట్టు సదరు విమానయాన సంస్థ తెలిపింది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన సేవల నిర్వహణ కోసం 72 సీట్లు కలిగిన విమానాన్ని  వినియోగించనున్నట్టు సంస్థ పేర్కొంది.

p> 

పూణె, అలహాబాద్, అహ్మదాబాద్, ఇండోర్, ముంబై, ఢిల్లీ, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలను అనుసంధానం చేసే ఈ పథకం సామాన్యులకు విమాన సేవలను చేరువ చేస్తున్నట్టు సంస్థ అభిప్రాయపడింది.

Trending News