'జయ'ఛానల్ పై ఐటీ మెరుపు దాడి

Last Updated : Nov 9, 2017, 05:02 PM IST
'జయ'ఛానల్ పై ఐటీ మెరుపు దాడి

చెన్నైలోని ఎక్కత్తుతంగల్‌లోని ' జయ టీవీ'  ఛానల్ కార్యాలయంపై ఐటీ అధికారులు గురువారం తెల్లవారుజామున దాడులు చేశారు. ఈ దాడుల్లో సుమారు పది మంది ఐటీ అధికారులు  పాల్గొన్నారు. ఆదాయపన్ను ఎగవేతకు సంబంధించి ఖచ్చితమైన ఆధారాలు దొరకబట్టే తనిఖీలకు దిగినట్లు అధికారులు చెబుతున్నారు.

ఈ టీవీ ప్రస్తుతం శశికళ కుటుంబ సభ్యుల ఆధీనంలో ఉంది. శశికళ మేనల్లుడు వివేక్ జయరాం ఇప్పుడు టీవీ ఛానల్ భాద్యతలను చూస్తున్నాడు. ఈ ఛానెల్ అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో దాడులు జరగటం ప్రాధాన్యత సంతరించుకుంది.  కాగా ఇదే సమయంలో శశికళ కుటుంబ సభ్యులకు చెందిన జాజ్ సినిమా థియేటర్, వివేక్ నివాసంపై ఏకకాలంలో దాడులు కొనసాగుతున్నాయి.

Trending News