రైల్వే ఉద్యోగులకు కేంద్రం దసరా కానుక

రైల్వే ఉద్యోగులకు కేంద్రం దసరా కానుక

Last Updated : Sep 19, 2019, 11:35 AM IST
రైల్వే ఉద్యోగులకు కేంద్రం దసరా కానుక

న్యూఢిల్లీ: విజయదశమి సందర్భంగా రైల్వే ఉద్యోగులకు కేంద్రం శుభ వార్త వెల్లడించింది. దసరా కానుకగా వారికి 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా అందజేయనున్నట్టు కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ తెలిపారు. ఇందుకు సంబంధించి రైల్వే శాఖ పంపించిన ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. కేబినెట్‌ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ మీడియాతో మాట్లాడుతూ.. కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంతో 11 లక్షల మందికి పైగా రైల్వే ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. దసరా బోనస్‌ చెల్లింపుల కోసం రూ.2,025 కోట్లు వెచ్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని.. ఈ బోనస్ సిబ్బందిలో మరింత ఉత్తేజాన్ని నింపుతుందని పేర్కొన్నారు.

Trending News