India Covid-19: గత 24గంటల్లో కరోనాతో 217 మంది మృతి

భారత్‌లో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. గతంలో నమోదైన కోవిడ్ కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండింటి సంఖ్య కూడా భారీగా తగ్గుముఖం పట్టింది.

Last Updated : Jan 3, 2021, 11:23 AM IST
India Covid-19: గత 24గంటల్లో కరోనాతో 217 మంది మృతి

India Coronavirus Updates | న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. గతంలో నమోదైన కోవిడ్ కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండింటి సంఖ్య కూడా భారీగా తగ్గుముఖం పట్టింది. గత 24గంటల్లో శనివారం (జనవరి 2న) కొత్తగా 18,177 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 217 మంది మరణించారు. 

తాజాగా నమోదైన గణాంకాలతో దేశంలో మొత్తం కరోనా (Corona cases) కేసుల సంఖ్య 1,03,23,965 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,49,435 కి చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Health Ministry) ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 96.16 శాతం ఉండగా.. మరణాల రేటు 1.45 శాతం ఉంది. Also Read: Heavy Rain In Delhi: దేశ రాజధానిని వణికిస్తున్న చలి, వర్షం

ఇదిలాఉంటే.. నిన్న కరోనా (Coronavirus) నుంచి 20,923 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న (cured cases) వారి సంఖ్య 99,27,310 కి పెరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో (active cases) 2,47,220 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 

Also read: Punjab సీఎంను చంపుతామంటూ పోస్టర్.. కేసు నమోదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News