తాగిన మైకంలో 4 కార్లు, 14 బైకులకు నిప్పుపెట్టాడు

తాగిన మైకంలో 4 కార్లు, 14 బైకులకు నిప్పుపెట్టాడు

Last Updated : Nov 8, 2018, 07:11 PM IST
తాగిన మైకంలో 4 కార్లు, 14 బైకులకు నిప్పుపెట్టాడు

ఢిల్లీలో తాగిన మైకంలో నాలుగు కార్లు, 14 ద్విచక్ర వాహనాలకు నిప్పుపెట్టిన ఓ 23 ఏళ్ల యువకుడిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని మదంగిర్‌లోని డీడీఏ అపార్ట్‌మెంట్స్‌లో మంగళవారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ద్విచక్రవాహనాలకు ఉన్న ఇంధనం పైపును తెరిచిన యువకుడు.. అనంతరం వాటికి నిప్పంటిస్తున్న వీడియో ఇప్పటికే ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. తెల్లవారుజామున 3.05 గంటలకు సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక శాఖ సిబ్బందితో సహా అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పేశారు. అయితే, అప్పటికే 8 ద్విచక్రవాహనాలు, మరో 2 కార్లు పూర్తిగా మంటల్లో దగ్ధమవగా మిగతా వాహనాలు పాక్షికంగా తగలబడిపోయాయి. 

ఈ ఘటనలో నిందితుడిగా ఉన్న యువకుడి కోసం అప్పటి నుంచి గాలిస్తున్న పోలీసులు గురువారం అతడిని అరెస్ట్ చేశారు.  

Trending News