అభిమాని చేసిన పనికి షాక్ అయిన పూజా హెగ్డే

 సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్లలో ఒకరైన  పూజా హెగ్డే  సౌత్‌తో పాటు బాలీవుడ్ మూవీ ఇండస్ట్రీస్‌లో పెద్ద సంఖ్యలో అభిమానులను కలిగిన జోవియల్ భామ. పూజ హెగ్డేను కలవడానికి బొంబాయికి వెళ్ళిన భాస్కర్ రావు అనే అభిమాని ప్రేమను చూసి  ఆమె

Last Updated : Jan 17, 2020, 12:06 AM IST
అభిమాని చేసిన పనికి షాక్ అయిన పూజా హెగ్డే

ముంబై: టాలీవుడ్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్లలో ఒకరైన పూజా హెగ్డే సౌత్‌తో పాటు బాలీవుడ్ మూవీ ఇండస్ట్రీలో పెద్ద సంఖ్యలో అభిమానులను కలిగిన జోవియల్ భామ. తనను కలవడానికి ముంబైకి వచ్చిన భాస్కర్ రావు అనే అభిమాని ప్రేమను చూసి ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అందుకు కారణం తనను చూడటానికి ముంబైకి వచ్చిన భాస్కర్ రావు... తన దర్శనం కోసం వేచిచూసే క్రమంలో ఐదు రోజుల పాటు ఫుట్‌పాత్‌పైనే పడుకున్నాడని తెలియడమే. అవును, పూజా హెగ్డే దర్శనం కోసం భాస్కర్ రావు ఐదు రోజుల పాటు ముంబై వీధుల్లోనే గడిపేశాడు. పగలూ, రాత్రి ఫుట్‌పాత్‌పైనే వేచిచూశాడు. తనను చూడటం కోసం అతడు చలిని కూడా లెక్కచేయలేదని తెలిశాకా.. తనను అంతగా అభిమానిస్తున్నందుకు పూజా హెగ్డె అతడికి ధన్యవాదాలు చెప్పకుండా ఉండలేకపోయింది.



View this post on Instagram


Bhaskar Rao thank you for coming all the way to Bombay and waiting for 5 days to see me. I am so touched but it also saddens me to see my fans going through so much trouble to do so.I would NEVER want to see you’ll sleeping on the road in order to do so.I promise you, I feel your love from wherever u’ll are, you’ll are my strength. LOVE YOU’LL. #bestfansever #touched #grateful 😭😭❤️❤️

A post shared by Pooja Hegde (@hegdepooja) on

పూజా హెగ్డే తనను కలవడానికి వచ్చిన భాస్కర్ రావుతో మాట్లాడుతూ.. నన్ను చూడటానికి ముంబైలో 5 రోజులు వేచి ఉన్నందుకు తన అభిమానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఆమె అన్నారు. కానీ ప్రాణాలను లెక్కచేయకుండా రోడ్డుపై పడుకోవడం సరికాదని.. అభిమానులు ఎక్కడున్నా... తాను వారి ప్రేమను ఫీల్ అవుతానని అన్నారామె. మీ అభిమానమే తన బలమని చెబుతూ భాస్కర్ రావుతో కాసేపు ముచ్చటించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News