అనిల్ కపూర్ నివాసం వద్ద సినీ ప్రముఖులు

సినీనటి శ్రీదేవి భౌతికకాయానికి నివాళులర్పించడానికి పలువురు సినీ ప్రముఖులు ముంబయికి చేరుకుంటున్నారు.

Last Updated : Feb 26, 2018, 04:35 PM IST
అనిల్ కపూర్ నివాసం వద్ద సినీ ప్రముఖులు

సినీనటి శ్రీదేవి భౌతికకాయానికి నివాళులర్పించడానికి పలువురు సినీ ప్రముఖులు ముంబయికి చేరుకుంటున్నారు. శ్రీదేవి సహనటులు రజనీకాంత్‌, వెంకటేష్‌, టబు, ఫరాఖాన్‌, రాణీ ముఖర్జీ, మాధురీ దీక్షిత్‌, నాజర్‌, ఫర్హాన్‌ అక్తర్‌, రితేష్‌ సిద్వానీ, కరణ్ జోహార్, మనీష్ మల్హోత్రా తదితరులు ముంబయిలోని అనిల్‌ కపూర్‌ ఇంటికి చేరుకున్నారు.

బోనీ కపూర్‌ మేనల్లుడు మోహిత్‌ పెళ్లి వేడుక కోసం దుబాయికి వెళ్లిన శ్రీదేవి గుండెపోటుకు గురై మృతి చెందారు. ఆమె భౌతికకాయాన్ని సోమవారం భారత్‌కు తీసుకువచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దుబాయిలో ఇంకా ఆమె పార్ధివదేహం తరలింపు ఏర్పాట్లు పూర్తికానుందున ఈ రోజు రాత్రి ముంబయికి చేరుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ ఆమె పార్ధివదేహాన్ని ముంబయి తీసుకువచ్చేందుకు తన ప్రైవేట్‌ జెట్‌ను పంపించినట్లు సమాచారం.

 

 

 

 

 

 

 

 

 

 

Trending News