Balakrishna No Remunaration: కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఒక్క రూపాయి రెమ్యునరేషన్ లేకుండా బాలయ్య నటించిన ఈ సినిమా తెలుసా..

Balakrishna No Remunaration: నందమూరి బాలకృష్ణ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.అందుకే బాలయ్యను నిర్మాతల హీరో అంటారు. నిర్మాణ సమయంలో ప్రొడ్యూసర్స్‌కు ఏదైనా ఇబ్బందులు ఎదురైతే తన పారితోషకాన్ని తగ్గించుకున్న సందర్భాలున్నాయి. కానీ ఈయన కెరీర్ పీక్స్‌లో ఉండగానే కోట్ల రూపాయలు తీసుకునే సమయంలో ఓ సినిమాకు మాత్రం అస్సలు రెమ్యునేషన్ తీసుకోలేదు.

Last Updated : Mar 24, 2024, 03:07 PM IST
Balakrishna No Remunaration: కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఒక్క రూపాయి రెమ్యునరేషన్  లేకుండా బాలయ్య నటించిన ఈ సినిమా తెలుసా..

Balakrishna No Remunaration: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఒక్కో సినిమాకు దాదాపు రూ. 20 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నాడు. ఇక కెరీర్ డల్‌గా ఉన్న సమయంలో ఓ సినిమాకు అసలు పారితోషకం తీసుకోకుండా నటించారు. అవును బాలయ్య కెరీర్ పూర్తిగా డల్‌గా ఉన్న సమయంలో ఇక కెరీర్ ఖతం అనుకుంటున్న సమయంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన 'సింహా' మూవీతో బాక్సాఫీస్ దగ్గర మరోసారి గర్జించాడు. ఈ సినిమాతో బాలయ్య బ్యాక్ బౌన్స్ అయ్యారు. ఆ తర్వాత ఈయన రెమ్యునరేషన్ ఒక్కసారిగా పెరిగింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్న టైమ్‌లో ఈయన మంచు వారి ఫ్యామిలీ తెరకెక్కించిన 'ఊ కొడతారా.. ఉలిక్కి పడతారా' సినిమాలో హీరోగా కాసేపు అతిథి పాత్రలో నటించారు.  బాలకృష్ణ హీరోగా కెరీర్ మొదలు పెట్టిన తర్వాత ఈయన అతిథి పాత్రలో నటించిన సినిమా ఇదే అవుతోంది. అతిథి పాత్ర అనేకంటే సినిమాలో ఈయన క్యారెక్టరే మెయిన్ అని చెప్పాలి. మంచు మనోజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో దీక్షా సేథ్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో మంచు లక్ష్మి మరో కీలక పాత్రలో నటించింది.

ఈ సినిమాలో యాక్ట్ చేసి నందుకుగాను బాలయ్య ఒక్క పైసా రెమ్యునరేషన్ తీసుకోలేదట. మోహన్ బాబు ఫ్యామిలీపై ఉన్న అభిమానంతోనే ఈ క్యారెక్టర్ చేసినట్టు చెప్పుకొచ్చారు. అప్పట్లో మోహన్ బాబు అన్నగారైన ఎన్టీఆర్‌తో 'మేజర్ చంద్రకాంత్' సినిమాను తెరకెక్కించారు. ఆ సినిమాకు తీసుకున్న పారితోషకంతోనే అన్నగారు బంజారాహిల్స్‌లో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించారు. ఇపుడు ఆ హాస్పిటల్ ఛైర్మన్‌గా ఉన్నారు బాలయ్య. మొత్తంగా బాలకృష్ణ కెరీర్ పీక్స్ ఉండగానే ఈ సినిమా కోసం ఒక్క రూపాయి తీసుకోకుండా నటించడం విశేషం. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు.

ప్రస్తుతం బాలకృష్ణ విషయానికొస్తే.. ఈయన తన కెరీర్‌లో ఎన్నడు లేనంత ఫుల్ జోష్‌లో ఉన్నాడు. అఖండ మూవీతో ప్రారంభ‌మైన బాల‌కృష్ణ ప్ర‌భంజ‌నం.. ఆ త‌ర్వాత వీర‌సింహారెడ్డి, భ‌గ‌వంత్ కేస‌రి మూవీల‌తో కంటిన్యూ అవుతూనే ఉంది. దాదాపు 30 యేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత బాలయ్య హాట్రిక్ హిట్స్ అందుకున్నారు.ఈ జోష్‌లోనే ఇపుడు బాబీ కొల్లి ద‌ర్శ‌క‌త్వంలో నెక్ట్స్ 109 మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాను సితార ఎంట‌ర్టైన్మెంట్స్ భారీ ఎత్తున తెరకెక్కిస్తోంది. బాబీ విషయానికొస్తే.. లాస్ట్ ఇయ‌ర్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య‌తో మంచి హిట్ అందుకున్నారు.  ఇపుడు బాల‌య్య‌ను ఇప్పటి వరకు ఎవరు చూపించిని విధంగా కొత్త‌గా చూపించ‌బోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో బాల‌య్య మ‌రోసారి డాన్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. బాబీతో చేస్తోన్న సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇక మ‌హా శివరాత్రి ప‌ర్వ‌దినం సందర్బంగా విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ సినిమాలో బాలయ్య మరోసారి రెండు విభిన్న పాత్రల్లో అలరించనున్నడానే మ్యాటర్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతుంది.

రీసెంట్‌గా బాలకృష్ణ డ్యూయల్ రోల్లో యాక్ట్ చేసిన 'అఖండ', వీరసింహారెడ్డి, అంతకు ముందు.. లెజెండ్, సింహా బాలయ్య రెండు విభిన్నపాత్రల్లో నటించిన చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. ఇపుడు అదే కోవలో బాబీ.. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రలను డిఫరెంట్‌గా వెండితెరపై ఆవిష్కరించబోతున్నడట.ఇక ఈ సినిమా పేరున తెలుగు నూతన సంవత్సాది ఉగాది కానుక‌గా విడుద‌ల చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు.

ఈ సినిమాలో బాలయ్యను ఢీ కొట్టే ప్రతినాయకుడిగా పాత్రలో ఒక‌ప్ప‌టి బాలీవుడ్ యాక్ష‌న్ హీరో బాబీ దేవోల్ నటిస్తున్నారు. ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ  ఇవ్వనున్నాడు. లాస్ట్ ఇయర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన 'యానిమల్‌' మూవీలో బాబీ దేవోల్ విలన్‌గా ఏ రేంజ్ పర్ఫామ్ చేసాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇపుడు ఈ సినిమాలో బాలయ్యను వెండితెరపై ఢీ కొట్టే సీన్స్ హైలెట్స్‌గా నిలువనున్నట్టు మేకర్స్ చెబుతున్నారు. డిక్టేట‌ర్, అఖండ‌, వీర‌సింహారెడ్డి, భ‌గ‌వంత్ కేసరి సినిమాల త‌ర్వాత బాల‌య్య సినిమాకు థ‌మ‌న్ సంగీతం స‌మ‌కూర్చుతున్నారు. జైల‌ర్ ఫేమ్ విజ‌య్ కార్తీక్ సినిమ‌టోగ్ర‌ఫీ అందిస్తున్నారు. నిరంజ‌న్ రెడ్డి ఎడిటింగ్ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను ఉగాది కానుక‌గా  వెల్లడించనున్నారు.

Also read: AP Inter Results 2024: ఏపీ ఇంటర్ పరీక్షలు 2024 ఫలితాలు ఎప్పుడు విడుదలంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News