మొన్న పవన్ కల్యాణ్ మాట్లాడిన వేదికపైకి ఇప్పుడు మహేష్ బాబు !!

ఇటీవల ఏ వేదికపై నుంచి అయితే పవన్ కల్యాణ్ తన అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారో... అదే వేదికపై నుంచి త్వరలోనే మహేష్ బాబు తన అభిమానుల ముందు ప్రసంగించనున్నాడు.

Last Updated : Mar 28, 2018, 09:14 AM IST
మొన్న పవన్ కల్యాణ్ మాట్లాడిన వేదికపైకి ఇప్పుడు మహేష్ బాబు !!

ఇటీవల జనసేన పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా ఏ వేదికపై నుంచి అయితే పవర్ స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్ తన అభిమానులు, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారో... అదే వేదికపై నుంచి త్వరలోనే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన అభిమానుల ముందు ప్రసంగించనున్నాడు. అవును, ఇందులో ఏ మాత్రం కన్‌ఫ్యూజన్ అవసరం లేదు. కాకపోతే అప్పుడు పవన్ కల్యాణ్ మాట్లాడింది ఓ రాజకీయ పార్టీకి అధినేత హోదాలో కాగా ఇప్పుడు మహేష్ బాబు మాత్రం ఓ సినిమా హీరోగా ఆ వేదిక ఎక్కనున్నాడు. పవన్ కల్యాణ్ విషయంలో ఆ సందర్భం జనసేన పార్టీ ఆవిర్భావ సభ కాగా ఇక్కడ మహేష్ బాబు విషయంలో ఆ సందర్భం భరత్ అనే నేను సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ కానుంది. మహేష్ బాబు అప్‌కమింగ్ సినిమా భరత్ అనే నేను ఏప్రిల్ 20న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

రిలీజ్ డేట్ సమీపిస్తున్న తరుణంలో ఏప్రిల్ 7న వైజాగ్‌లో బీచ్ ఒడ్డున సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ వేడుకగా జరుపుకోవాలని భరత్ అనే నేను మూవీ యూనిట్ ప్లాన్ చేసింది. అయితే, అందుకు వైజాగ్ అధికార యంత్రాంగం నుంచి అనుమతి లభించలేదని తెలుస్తోంది. దీంతో అదే ఈవెంట్ వేదికను గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్శిటీ ఎదుట వున్న ప్రాంగణానికి మార్చినట్టు తెలుస్తోంది. 

కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు ఓ ముఖ్యమంత్రి పాత్రలో నటించగా బాలీవుడ్ నటి కియారా అద్వానీ సూపర్ స్టార్‌కి జోడీగా నటించింది. మహేష్ బాబుని యువ ముఖ్యమంత్రి పాత్రలో చూడాలంటే ఏప్రిల్ 20వ తేదీ వరకు వేచిచూడక తప్పదు. 

Trending News