Kangana Ranaut: కరణ్ జోహార్ నుంచి పద్మశ్రీ అవార్డు వెనక్కి తీసుకోవాలి

సుశాంత్ సింహ్ రాజ్ పుత్ ( Sushant singh rajput ) మరణ వ్యవహారం నుంచి ఫైరవుతున్న కంగనా రనౌత్ మరోసారి నిప్పులు చెరిగింది. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ పై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అతన్నించి అవార్డు వెనక్కి తీసుకోవాలని కోరింది.

Last Updated : Aug 18, 2020, 07:48 PM IST
Kangana Ranaut: కరణ్ జోహార్ నుంచి పద్మశ్రీ అవార్డు వెనక్కి తీసుకోవాలి

సుశాంత్ సింహ్ రాజ్ పుత్ ( Sushant singh rajput ) మరణ వ్యవహారం నుంచి ఫైరవుతున్న కంగనా రనౌత్ మరోసారి నిప్పులు చెరిగింది. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ పై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అతన్నించి అవార్డు వెనక్కి తీసుకోవాలని కోరింది.

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా పేరొందిన కంగనా రనౌత్ ( Kangana Ranaut ) కు వివాదాస్పద వ్యాఖ్యల అలవాటే. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ( producer karan johar ) పై ఆమె మరోసారి విరుచుకుపడింది. సుశాంత్ సింహ్ మరణ వ్యవహారంలో ఇప్పటికే కరణ్ ను ఇరుకునపెడుతూ తీవ్ర ఆరోపణలు చేసింది. సుశాంత్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితులకు కరణ్ జోహారే కారణమని కంగనా ఆరోపించింది. ఈ వ్యవహారం నిన్నటివరకూ సంచలనంగానే ఉంది. ఇప్పుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది.  కరణ్ జోహార్..పద్మశ్రీ పురస్కారానికి ( padma sri award ) అనర్హుడని..కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని సోషల్ మీడియా సాక్షిగా కోరింది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేసింది.

కరణ్ జోహార్ పద్మశ్రీ అవార్డును తిరిగి తీసుకోవాలని నేను భారత ప్రభుత్వాన్నిఅభ్యర్దిస్తున్నాను. అతను నన్ను అంతర్జాతీయ వేదికపై పరిశ్రమ వదిలిపోవల్సిందిగా బెదిరించాడు. యువ హీరో సుశాంత్ కెరీర్ ( Sushant career ) ను దెబ్బతీసేందుకు కుట్ర పన్నాడు. ఉరి చిత్ర వివాద సమయంలో పాకిస్తాన్ కు మద్దతిచ్చారు. ఇప్పుడు భారత సైన్యాన్ని అవమానపర్చే విధంగా యాంటీ నేషనల్ చిత్రం నిర్మిస్తున్నారంటూ కంగనా రనౌత్ ట్వీట్ చేసి సంచలనం సృష్టిస్తోంది. 

Trending News