Chiranjeevi - Vishwambhara:విశ్వంభ‌ర కోసం పోరు బాట ప‌ట్టిన చిరంజీవి..

Chiranjeevi - Vishwambhara: భోళా శంకర్ డిజాస్ట‌ర్ త‌ర్వాత చిరంజీవి త‌న సినిమాల విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అందుకే రీమేక్‌ల‌ను పూర్తిగా ప‌క్క‌న  పెట్టి సొంత క‌థ‌ల‌నే న‌మ్ముకున్నాడు. ఈ కోవ‌లో  'బింబిసార'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు వశిష్ఠతో విశ్వంభ‌ర సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన బిగ్ అప్‌డేట్ ఇచ్చారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 2, 2024, 08:45 PM IST
Chiranjeevi - Vishwambhara:విశ్వంభ‌ర కోసం పోరు బాట ప‌ట్టిన చిరంజీవి..

Chiranjeevi - Vishwambhara:  మెగాస్టార్ చిరంజీవి త‌న సినిమాల విష‌యంలో ఎంతో కేర్ తీసుకుంటున్నాడు.  ప్రస్తుతం వ‌శిష్ఠ ద‌ర్శ‌క‌త్వంలో 'విశ్వంభర' సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీని 2025 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మూవీని 2025 జనవరి 10న సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు ముందే ప్రకటించి సంక్రాంతి బెర్త్ కన్ఫామ్ చేసుకున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జ‌రుగుతోంది. ఇందులో రామ్ ల‌క్ష్మ‌ణ్ నేతృత్వంలో యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు.

 మెగాస్టార్ చిరంజీవి వ‌య‌సు పెరిగే కొద్ది చిన్న పిల్లాడు అయిపోతున్నాడు. యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ ఎవ‌రు లేనంత ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో 'విశ్వంభర' మూవీ చేస్తున్నారు చిరు. ఇప్పటికే విడుదలైన 'విశ్వంభర' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు When MYTHS Collides Legends Rise అని చెబుతూ పోస్టర్ రిలీజ్ చేశారు. అంటే ఎపుడైతే అద్భుత శక్తులు కలుస్తాయో.. అపుడు ఒక లెజెండ్ అదే అద్భుతమైన వ్యక్తి పుట్టుకొస్తాడని అర్ధంలో కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్  చేసారు. ముందుగా ఈ చిత్రానికి 'ముల్లోక వీరుడు' అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. కానీ ఫైనల్‌గా ఈ మూవీకి 'విశ్వంభర' టైటిల్ ఫిక్స్ చేసారు.

ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది.  తాజాగా ఈ సినిమాలో ఇషా చావ్లా, సురభి కూడా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు.  ఇందులో అప్సరస క్యారెక్టర్స్ చేయబోతున్నట్టు సమాచారం. మరోవైపు వరలక్ష్మి శరత్‌కుమార్ మరో లీడ్ రోల్లో నటిస్తున్నట్టు సమాచారం. చిరు.. యముడికి మొగుడు, జగదేకవీరుడు అతిలోక సుందరి. అంజి సినిమాల తర్వాత నటిస్తోన్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర' కావడం విశేషం. ఈ మూవీలో చిరంజీవిని ఢీ కొట్టే విలన్ పాత్రలో తమిళ హీరో శింబు న‌టిస్తున్న‌ట్టు  సమాచారం. మరోవైపు శింబుతో తమిళంలో ఈ సినిమాకు మంచి మార్కెట్ దొరికే అవకాశం ఉంది. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ $4 మిలియన్ యూఎస్ డాలర్స్‌కు అమ్ముడు పోయినట్టు సమాచారం. చిరంజీవి గత సినిమాలేవి 1 మిలియన్ డాలర్ మించి కలెక్ట్ చేయలేదు. ఇలాంటి సమయంలో సబ్జెక్ట్ పై నమ్మకంతో పాటు సంక్రాంతి సీజన్ కలిసొస్తుందనే నమ్మకంతో బయ్యర్స్ ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ఈ రేటుకు కొన్న‌ట్టు తెలుస్తోంది.

మరోవైపు చిరంజీవి పెద్ద బిడ్డ‌ సుస్మిత నిర్మాణంలో ఓ మూఈ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ భాగస్వామ్యంలో ఈ చిత్రం తెరకెక్కబోతుంది. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ డైరెక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం రవితేజతో 'మిస్టర్ బచ్చన్' మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ హిందీలో అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటించిన 'రెయిడ్' మూవీకి రీమేక్. మరోవైపు పవన్ కళ్యాణ్‌తో చేస్తోన్న 'ఉస్తాద్ భగత్ సింగ్' ఎన్నికల తర్వాత ఈ యేడాది ద్వితీయార్ధంలో మళ్లీ ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఆ లోపు రవితేజ తర్వాత చిరుతో ఈ సినిమా కంప్లీట్ చేయనున్నాడు. త్వరలో ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్ల‌డి కావాల్సి ఉంది.

Also Read: KTR Vs Kishan Reddy: గాలికి గెలిచిన కిషన్‌ రెడ్డికి ఈసారి ఓటమే.. ఇదే నా ఛాలెంజ్‌: కేటీఆర్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News