Ismart Shankar Sequel : ఆరు నెలల తరువాత ఛార్మీ పోస్ట్.. ఇన్నాళ్లకు మళ్లీ సౌండ్ చేయడానికి కారణమిదే

Ismart Shankar Sequel ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ అవ్వడంతో ఇటు పూరి జగన్నాథ్, అటు రామ్ పోతినేని ఫాంలోకి వచ్చారు. అయితే ఇస్మార్ట్ తరువాత రామ్ మెల్లిగా సినిమాలు లైన్‌లో పెడుతూ సక్సెస్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. పూరి జగన్నాథ్ లైగర్ అంటూ మరింతగా పాతాళానికి పడిపోయాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 14, 2023, 09:39 AM IST
  • చాలా గ్యాప్ ఇచ్చిన ఛార్మీ
  • ఆరు నెలల తరువాత పోస్ట్
  • ఇస్మార్ట్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత
Ismart Shankar Sequel : ఆరు నెలల తరువాత ఛార్మీ పోస్ట్.. ఇన్నాళ్లకు మళ్లీ సౌండ్ చేయడానికి కారణమిదే

Ismart Shankar Sequel నాలుగేళ్ల క్రితం వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాకు సీక్వెల్‌ ప్లాన్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఛార్మీ తాజాగా ఓ పోస్ట్ వేసింది. లైగర్ సినిమా డిజాస్టర్ అవ్వడంతో పూరి, ఛార్మీలకు చిక్కులు వచ్చి పడ్డాయి. డిస్ట్రిబ్యూటర్లు నష్టపోవడం, వాటి గొడవలో పూరి ఇంకా డౌన్ అయిపోయాడు. ధర్నా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు, తన ఫ్యామిలీని భయపెడుతున్నారంటూ పూరి జగన్నాథ్ కూడా ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

అలా లైగర్ దెబ్బతో పూరి, ఛార్మీలు కాస్త సైలెంట్ అయిపోయారు. జన గణ మన సినిమాను కూడా అటకెక్కించారు. పూరికి విజయ్‌ దూరంగా ఉండటం ప్రారంభించాడు. అయితే తన నెక్ట్స్ సినిమాను ఎవరితో చేయాలని పూరి తెగ ఆలోచించాడు. చిరంజీవికి సైతం కథను చెప్పాడట. కానీ అది అంతగా సెట్ అవ్వలేదని టాక్. అయితే ఇప్పుడు పూరికి హీరో దొరికాడు. మళ్లీ తన ఇస్మార్ట్ హీరో రామ్‌తోనే సినిమాను చేయబోతోన్నాడు పూరి.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Charmmekaur (@charmmekaur)

ఇస్మార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కాంబో.. నాలుగేళ్ల తరువాత మళ్లీ కలిసి రాబోతోన్నారు.. రామ్, పూరి జగన్నాథ్ ఫోర్స్ మళ్లీ రాబోతోంది.. పూరి కనెక్ట్స్‌లో భాగంగా పూరి జగన్నాథ్, ఛార్మీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.. నేటి సాయంత్రం నాలుగు గంటలకు దిమ్మాక్ ఖరాబ్ అప్డేట్ ఇవ్వబోతోన్నామని చెప్పుకొచ్చింది ఛార్మీ.

Also Read:  Adipurush Trailer: ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్.. మా రాఘవుడి కథే రామాయణం.. ఆ ఒక్కటే మైనస్

ఛార్మీ గత ఏడాది నవంబర్లో చివరి పోస్ట్ వేసింది. మళ్లీ ఇప్పుడే ఈ అప్డేట్ ఇస్తూ పోస్ట్ వేసింది. అంటే ఇన్ని రోజులు ఓ ప్రాజెక్ట్‌ను సెట్ చేసుకునేందుకు చాలానే కష్టపడ్డట్టుగా కనిపిస్తోంది. ఇక ఈ మధ్యే పూరి జగన్నాథ్ తన ఫ్యామిలీతో కలిసి కనిపించాడు. ఇక ఛార్మీని పూర్తిగా దూరం పెట్టాడని అంతా భావించారు. కానీ ఇంతలోనే ఇలా అప్డేట్ ఇచ్చారు. ఇద్దరం కలిసి మళ్లీ సినిమాను నిర్మించబోతోన్నామని ప్రకటించారు.

Also Read:  HBD Sai Pallavi : నీ చెల్లిగా పుట్టినందుకు నేను లక్కీ.. మిస్ అవుతున్నా.. సాయి పల్లవి సిస్టర్ స్పెషల్‌ విషెస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News