Allu Arjun: అల్లు అర్జున్ సరసన క్రేజీ బాలీవుడ్ భామ.. ? త్రివిక్రమ్ ప్లాన్ మాములుగా లేదుగా.. ?

Allu Arjun - Trivikram : అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప2' మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమాలో బన్ని సరసన బాలీవుడ్ భామ నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 6, 2024, 09:00 AM IST
Allu Arjun: అల్లు అర్జున్ సరసన క్రేజీ బాలీవుడ్ భామ.. ? త్రివిక్రమ్ ప్లాన్ మాములుగా లేదుగా.. ?

Allu Arjun - Trivikram- Deepika Padukone: స్టైలిష్ స్టార్..కాదు కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో చేసిన 'పుష్ప' మూవీతో ప్యాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. అంతేకాదు పుష్ప మూవీలోని నటనకు బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డును సైతం అందుకున్నారు. తెలుగు  సినీ రంగం నుంచి ఈ అవార్డు అందుకున్న ఫస్ట్ హీరోగా అల్లు అర్జున్ రికార్డ్ క్రియేట్ చేసాడు. ఈ మూవీకి కొనసాగింపుగా పుష్ప 2 మూవీ రాబోతుంది. ఈ యేడాది ఆగష్టు 15న విడుదల కాబోతుంది. ఈ మూవీపై తెలుగు సహా ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మూవీకి పోటీగా హిందీలో సింగం 3 మూవీ విడుదల కాబోతుంది.

ఆ సంగతి పక్కన పెడితే.. అల్లు అర్జున్ ..సుకుమార్‌తో చేస్తోన్న 'పుష్ప 2' మూవీ తర్వాత త్రివిక్రమ్‌తో నెక్ట్స్ మూవీ ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే అధికారక  ప్రకటన వెలుబడింది. పుష్ప2 తర్వాత త్రివిక్రమ్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే ప్యాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్.. త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమాను కూడా అదే రేంజ్‌లో తెరకెక్కించనున్నాడు. అందుకు తగ్గట్టు స్టోరీని ప్లాన్ చేసినట్టు సమాచారం. అందుకే ఈ సినిమాలో ప్యాన్ ఇండియా లెవల్లో హీరోయిన్‌గా సత్తా చాటుతున్న దీపికా పడుకోణెను హీరోయిన్‌గా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే దీపికాను కలిసి ఈ స్టోరీని నేరేట్ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఈమె తెలుగులో ప్రభాస్.. కల్కి మూవీలో నటిస్తోంది. ఒకవేళ దీపికా ఓకే చెబితే ఆమె నటించబోతున్న రెండో సినిమా ఇదే అవుతోంది. ఇక దీపికా రాకతో అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీపై భారీ అంచనాలే ఏర్పడే అవకాశాలున్నాయి.  

 ఇప్పటికే త్రివిక్రమ్ అల్లు అర్జున్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసారు. రీసెంట్‌గా గురూజీ మహేష్ బాబుతో చేసిన 'గుంటురు కారం' సినిమాతో చేదు ఫలితాన్ని అందుకున్నాడు. స్టార్ హీరోతో స్టార్ డైరెక్టర్ అయిన త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ మూవీ మంచి వసూళ్లను సాధించినా.. వీరి ఇమేజ్‌కు అది తక్కువే అని అందరు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ సినిమాలో త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగులు అదిరిపోయినా.. ప్రేక్షకులు ఎందుకో ఈ సినిమాను తిరస్కరించారు. తల్లితో కుమారుడికి సంబంధం లేదంటూ కుమారుడు ఓ బ్యాండ్ పేపర్ రాసివ్వడమనే పాయింట్ చుట్టే ఈ సినిమా కథ నడిపించాడు మాటల మాంత్రికుడు.

ఆ సంగతి పక్కన పెడితే.. ఇపుడు అల్లు అర్జున్‌తో చేయబోయే సినిమాకు సంబంధించి కథ విషయంలో ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకొని ఈ మూవీ స్టార్ట్ చేయనున్నాడు. ఈ సినిమా ఈ ఇయర్ సెప్టెంబర్‌లో ప్రారంభించి .. వచ్చే యేడాది వేసవి కానుకగా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక గతంలో వీళ్లిద్దరి కలయికలో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమలు మంచి విజయాలే సాధించాయి. అల వైకుంఠపురములో సినిమా మాత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇపుడు రాబోతున్న నాల్గో చిత్రాన్ని హరికా అండ్ హాసినీ క్రియేషన్స్‌తో పాటు గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించే అవకాశాలున్నాయి.అటు అల్లు అర్జున్.. త్రివిక్రమ్ మూవీ తర్వాత బోయపాటి శ్రీను, సందీప్ రెడ్డి వంగాలతో పాటు, సురేందర్ రెడ్డితో రేసుగుర్రం 2 మూవీలు చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇదీ చదవండి:  Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడా బంపర్ ఆఫర్.. పరీక్ష లేకుండా రూ.69,000 జీతంతో ఉద్యోగం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News