Karampudi Man Death News: కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన.. భార్య బిడ్డకు జన్మనిచ్చిన ఆసుపత్రికే భర్త మృతదేహం

Palnadu News: పల్నాడు జిల్లాలో జరిగిన ఓ సంఘటన కన్నీళ్లు పెట్టిస్తోంది. భార్య పండంటి బిడ్డకు ప్రసవించగా.. కాసేపటికే అదే ఆసుపత్రికి భర్త మృతదేహాన్ని తీసుకురావడం విషాదాన్ని నింపింది. కన్నబిడ్డను చూడకుండానే ఆ తండ్రి ఈ లోకాన్ని విడిచి వెళ్లాడు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 29, 2023, 07:03 PM IST
Karampudi Man Death News: కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన.. భార్య బిడ్డకు జన్మనిచ్చిన ఆసుపత్రికే భర్త మృతదేహం

Palnadu News: ఆ మహిళ ప్రసవానికి మూడు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. చివరకు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే బిడ్డను ప్రసవించిన ఆసుపత్రికే భర్త మృతదేహాన్ని తీసుకురావడం కన్నీళ్లు తెప్పిస్తోంది. ఈ ప్రపంచాన్ని కళ్లు తెరిచి చూసేలోపే ఆ పసికందు కన్నతండ్రిని కోల్పోగా.. తన బిడ్డను చూడంగానే ఆ కన్నతండ్రి కన్నుమూశాడు. మాటలకందని ఈ విషాద ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా..

కారంపూడికి చెందిన రామాంజిని అనే మహిళకు శుక్రవారం రాత్రి పురిటి నొప్పులు వచ్చాయి. 10 గంటల సమయంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు. అక్కడ పూర్తిస్థాయిలో వైద్యసదుపాయాలు లేవని అక్కడి వైద్యులు గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి రీఫర్ చేశారు. రాత్రి 11 గంటల సమయంలో గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా.. ఇక్కడ వైద్యులు కూడా అదే సమాధానం చెప్పారు. 70 కి.మీ దూరంలో ఉన్న నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. నరసరావుపేట ఆస్పత్రి వద్దకు చేరగానే ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

భార్యతోపాటు కారంపూడి నుంచి గురజాల ఆస్పత్రి వరకు తోడుగా వచ్చాడు రామంజిని భర్త ఆనంద్‌ (40). వైద్యులు నరసరావుపేటకు వెళ్లమని చెప్పడంతో భార్యను, కుటుంబ సభ్యులను వెళ్లమని చెప్పి.. తాను ఇంటికి వెళ్లి డబ్బులు తెస్తానని బయలుదేరాడు. బైక్‌పై ఇంటికి వెళ్లి నరసరావుపేటకు వస్తున్న క్రమంలో జోలకల్లు వద్ద రోడ్డుపై ఉన్న పెద్ద గుంతలో పడిపోయాడు. తీవ్రంగా గాయపడి ఉన్న ఆనంద్‌ను స్థానికులు గమనించి.. నరసరావుపేటకు తరలించారు. ఆస్పత్రి వద్దకు చేరగానే అతను ప్రాణాలు కోల్పోయాడు. బిడ్డను చూడకుండానే ఆ కన్నతండ్రి మరణించడం కన్నీళ్లు పెట్టించింది. పాప పుట్టిన ఆనందం కాసేపటికే ఆవిరైపోయింది. భర్త మరణవార్త తెలుసుకుని ఆ మహిళ కన్నీమున్నీరుగా విలపించింది. 

Also Read: Drop 4K Tv Price: బిగ్ దసరా సేల్‌లో సాంసంగ్‌ 4K Tv స్మార్ట్‌ టీవీని రూ.22,940కే పొందండి!

Also Read:  Lava Blaze Pro 5G Price: బంఫర్‌ ఆఫర్‌ మీ కోసం..Lava Blaze 5G మొబైల్‌పై రూ.9,400 వరకు తగ్గింపు! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News