197వ రోజు ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్

ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్‌కి స్థానికుల విన్నపాలు  

Last Updated : Jun 25, 2018, 04:55 PM IST
197వ రోజు ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్

ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపడమే ప్రధాన అజెండాగా ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 197 రోజైన నేడు తూర్పుగోదావరి జిల్లా ములికిపల్లి నుంచి యాత్ర ప్రారంభమైంది. గత మూడు రోజులుగా రాజోలు నియోజకవర్గంలో జరుగుతున్న జగన్ ప్రజా సంకల్ప యాత్రకు పార్టీ కార్యకర్తలు, జగన్ అభిమానుల నుంచి విశేష స్పందన కనిపిస్తోంది. తమ ప్రాంతంలోని సమస్యలు తెలుసుకుని, తమకు భరోసా ఇచ్చేందుకు తమ మధ్యలోకే వస్తోన్న జగన్‌కి ఎక్కడికక్కడ స్థానికులు ఘన స్వాగతం పలుకుతున్నారు. 

జూన్ 23న ఒలంపిక్స్ డే సందర్భంగా నిన్న ప్రజా సంకల్పయాత్రలోనే ఒలంపిక్ జ్యోతిని వెలిగించిన వైఎస్ జగన్.. అనంతరం ఒలంపిక్ రన్‌ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.

 

Trending News