తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక

వాయువ్య బంగాళాఖాతంలో మరింత బలపడిన అల్పపీడనం

Last Updated : Aug 27, 2018, 07:05 PM IST
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. ఈ అల్పపీడనానికి తోడు ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడిన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రానున్న 48 గంటలపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరుపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ ప్రకటించింది. ముఖ్యంగా తీరంవెంట పశ్చిమ దిశగా... గంటకు 45 కి.మీ నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున ఈ సమయంలో మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఈదురు గాలుల ప్రభావం కారణంగా ఉత్తర కోస్తాలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. 

ఇదిలాఉంటే, ఇప్పటికే ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా గోదావరిలోకి వస్తోన్న వరద ఉధృతి ఇంకా కొనసాగుతోంది. ఈ వర్షాల కారణంగా వరద తీవ్రత అధికమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని ఈ సందర్భంగా అధికారులు సూచించారు.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x