నెల్లూరులో రాష్ట్రపతికి స్వాగతం పలికిన ఏపీ మంత్రులు

నెల్లూరులో రాష్ట్రపతికి స్వాగతం పలికిన ఏపీ మంత్రులు

Last Updated : Feb 22, 2019, 02:17 PM IST
నెల్లూరులో రాష్ట్రపతికి స్వాగతం పలికిన ఏపీ మంత్రులు

నెల్లూరు: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కొద్దిసేపటి క్రితమే నెల్లూరుకు చేరుకున్నారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు పొంగూరు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, అమరనాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ తదితరులు రాష్ట్రపతికి ఎదురెళ్లి ఘన స్వాగతం పలికారు. నెల్లూరులో జరగనున్న స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ వార్షికోత్సవంలో పాల్గొని ప్రసంగించేందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అక్కడకు చేరుకున్న సంగతి తెలిసిందే.

Trending News