YSR BOOK: తెలుగు పుస్తకాల్లో రికార్డు సాధించిన నాలో..నాతో..YSR

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ( Former cm ysr )  సతీమణి విజయమ్మ ( ys vijayamma )  రాసిన పుస్తకం ఇప్పుడు సంచలనమౌతోంది. నాలో..నాతో YSR పుస్తకం హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది. ఆలోచనల ప్రవాహంగా..భావోద్వేగాల సమాహారంగా సాగిన ఆ పుస్తకం అప్పుడే రెండో ఎడిషన్ కు సిద్ధమవుతోంది. 

Last Updated : Jul 11, 2020, 03:22 PM IST
YSR BOOK: తెలుగు పుస్తకాల్లో రికార్డు సాధించిన నాలో..నాతో..YSR

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ( Former cm ysr )  సతీమణి విజయమ్మ ( ys vijayamma )  రాసిన పుస్తకం ఇప్పుడు సంచలనమౌతోంది. నాలో..నాతో YSR పుస్తకం హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది. ఆలోచనల ప్రవాహంగా..భావోద్వేగాల సమాహారంగా సాగిన ఆ పుస్తకం అప్పుడే రెండో ఎడిషన్ కు సిద్ధమవుతోంది. 

 

జూలై 8న జరిగిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ 71 వ జయంతి సందర్బంగా విడుదలైన నాలో..నాతో YSR ( Naa lo..naa tho..YSR ) ( Within me..With me..YSR ) పుస్తకం ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతోంది. వైఎస్ విజయమ్మ రాసిన ఈ పుస్తకాన్ని ఆమె తనయుడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan )  ఆవిష్కరించారు. తొలి ఎడిషన్ లో 5 వేల కాపీల్ని ముద్రించారు. ఎమెస్కో సంస్థ ( Emesco ) దీన్ని ప్రచురించింది. ఈ పుస్తకం ఆవిష్కరించిన రోజే బాగా ట్రెండ్ కావడంతో పుస్తకం కాపీలన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. తొలిరోజే ఆన్ లైన్ ద్వారా మొత్తం 5 వేల కాపీలు సేల్ అయిపోయాయి. ఓ పుస్తకానికి సంబంధించి తొలి ఎడిషన్ కాపీలన్నీ ఒక్కరోోజే అమ్ముడైపోవడం ఇది తొలిసారని ఎమెస్కో సంస్థ వెల్లడించింది. తెలుగు పుస్తకాల అమ్మకాల్లో ఇది ఒక రికార్డుగా ఆ సంస్థ చెబుతోంది. Also read: YSR: నాలో..నాతో YSR పుస్తకంలో ఏముంది?

 

ఈ పుస్తకం అంతలా హాట్ కేకులా అమ్ముడవడానికి చాలా కారణాలున్నాయి. వైఎస్ఆర్ జీవితంలో ( YSR LIFE ) , రాజకీయ ప్రయాణంలో బయటి ప్రపంచం చూడని కొత్త కోణాన్ని పుస్తక రచయిత వైఎస్ విజయమ్మ పరిచయం చేయడం ప్రధానమైంది. ఇక రెండవ కారణం పుస్తకాంశం ఓ మాజీ ముఖ్యమంత్రిది కావడం, రచించింది ఆయన సతీమణి కావడం, ఆవిష్కరించింది ఆయన తనయుడు ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కావడం. Also read: AP: మరో వినూత్న ప్రయోగం: కరోనా బస్సులుగా ఇంద్రబస్సులు

తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ఆర్ ( YSR ) కు పెద్దఎత్తున అభిమానులున్నారు. అందుకే ఫస్ట్ ఎడిషన్ కాపీలన్నీ తొలిరోజే అమ్ముడైపోయాయని విశ్లేషకులు భావిస్తున్నారు. “ వైఎస్ఆర్ ( YSR ) గురించి ప్రపంచానికేమి తెలుసో నేను అర్ధం చేసుకుంటాను. అయితే ఆ మహానేత గురించి బయటి ప్రపంచానికి తెలియని కొన్ని వాస్తవాల్ని ఈ పుస్తకంలో రాశానని “  ముందుమాటలో వైఎస్ విజయమ్మ ( ys vijayamma ) రాసుకొచ్చారు. ఓ కొడుకుగా, తండ్రిగా, సోదరుడిగా, భర్తగా, అల్లుడిగా, మామగా, స్నేహితుడిగా, ఓ నేతగా ఎలా అన్ని బాధ్యతల్ని వైఎస్ఆర్ నెరవేర్చారనేది కూలకషంగా పుస్తకంలో పొందుపర్చినట్టు రచయిత తెలిపారు. 

ఇన్ని విశిష్టతలు, వైఎస్ఆర్ గురించి తెలియని కొత్త కోణాన్ని రచయిత స్పృశించడమే నాలో...నాతో..YSR ( Naa lo..Naa tho..YSR ) పుస్తకం ప్రాచుర్యం పొందడానికి కారణంగా తెలుస్తోంది. అందుకే పుస్తకాన్ని ప్రచురించిన ఎమెస్కో సంస్థ రెండో ఎడిషన్ లో సంఖ్యను పెంచడానికి యోచిస్తోంది.   జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    

Trending News