పవన్ కన్నా చిరంజీవే బలవంతుడట

జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ కన్నా.. ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుడు చిరంజీవి ఎన్నో రెట్లు బలవంతుడని ఇటీవలే ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగుదేశం పార్టీ నేత కేశినేని నాని తెలిపారు.

Last Updated : Aug 19, 2018, 07:21 PM IST
పవన్ కన్నా చిరంజీవే బలవంతుడట

జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ కన్నా.. ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుడు చిరంజీవి ఎన్నో రెట్లు బలవంతుడని ఇటీవలే ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగుదేశం పార్టీ నేత కేశినేని నాని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో జనసేనకు కనీసం ఒక్కసీటైనా వస్తుందో రాదో తనకు అనుమానమేనని అన్నారు. చిరంజీవిపై ఎలాంటి వివాదాలు లేవని.. కానీ పవన్ కళ్యాణ్ వివాదాల చుట్టే తిరుగుతున్నారని నాని అన్నారు.

ఎంతో గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి.. మంచి పేరు ప్రఖ్యాతులు ఉండి కూడా చిరంజీవి కేవలం 18 సీట్లు మాత్రమే సంపాదించుకున్నారని.. అలాంటప్పుడు చిరంజీవి కన్నా తక్కువ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ గెలుస్తారని ఎలా నమ్మగలమని తన అనుమానాన్ని వ్యక్తం చేశారు కేశినేని నాని. తెలుగుదేశం పార్టీ లేదా చంద్రబాబు ఎప్పుడూ పవన్ కళ్యాణ్‌ను దూరం చేసుకోవాలని అనుకోలేదని.. కానీ యూటర్న్ తీసుకున్న పవన్ కళ్యాణ్ చంద్రబాబుని, నారా లోకేష్‌ని విమర్శించడమే పనిగా పెట్టుకొని కుటిల రాజకీయాలకు తెరదీస్తున్నారని కేశినేని నాని అన్నారు. 

రాజకీయ పరిణితి లేకపోవడం వల్లే పవన్ కళ్యాణ్ తనకు తోచిన విధంగా వ్యవహరిస్తున్నారని.. అందుకే చంద్రబాబుపై విమర్శలు కురిపిస్తున్నారని నాని అన్నారు. అవిశ్వాస తీర్మానం పెడితే.. అందులో పూర్తిస్థాయిలో పాల్గొంటానని చెప్పిన పవన్ ఆ తర్వాత పత్తా లేకుండా పోయారని నాని విమర్శించారు. ఒకవేళ పవన్, బీజేపీతో కలిసి వెళ్లాలని భావిస్తున్నారేమోనని తనకు అనిపిస్తుందని కూడా కేశినేని నాని అన్నారు. 

Trending News