కామాంధులు వేధిస్తున్నారని.. కుటుంబం ఆత్మహత్య !

విశాఖపట్నంలో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడటం మిస్టరీగా మారింది. 

Last Updated : Jan 5, 2018, 08:54 PM IST
కామాంధులు వేధిస్తున్నారని.. కుటుంబం ఆత్మహత్య !

విశాఖపట్నంలో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడటం మిస్టరీగా మారింది. ఆరిలోవ ముస్తఫ కాలనీలో నివాసం వుంటున్న దేవిరెడ్డి రాజేశ్వర్, అతడి భార్య సౌమ్య గురువారం రాత్రి తమ ఇద్దరు పిల్లలని హత్యచేసి వారు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని రాజేష్ ఇంటిని పరిశీలించగా వారికి ఓ సూసైడ్ నోట్ లభించింది. తమ ఆత్మహత్యలకి ఎవ్వరూ కారణం కాదు అని రాజేష్ భార్య సౌమ్య తన సమీప బంధువుకి రాసిన సూసైడ్ నోట్ అది. కాకపోతే కొంతమంది కామాంధులు తన చుట్టూ తిరుగుతున్నారని, వారి వేధింపులని తాను వర్ణించలేను అని సౌమ్య తన ఆవేదనను ఆ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు.

ప్రకాశం జిల్లా కనిగిరి రాజేశ్ స్వస్థలం. జరిగిన దారుణంపై సమాచారం అందుకున్న రాజేశ్-సౌమ్యల బంధువులు విశాఖకు బయల్దేరారు. ప్రస్తుతం పోస్టుమార్టం నిమిత్తం శవాలని ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Trending News