AP: తాజాగా 10,621 కరోనా కేసులు.. 92మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌ ( Andhra Pradesh ) లో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో నిత్యం కోవిడ్ 19 కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి.

Last Updated : Aug 27, 2020, 05:53 PM IST
AP: తాజాగా 10,621 కరోనా కేసులు.. 92మంది మృతి

Andhra Pradesh Covid-19 updates: అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ( Andhra Pradesh ) లో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో నిత్యం కోవిడ్ 19 కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. గత 24గంటల్లో 10,621 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 92మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్యఆరోగ్యశాఖ ( AP Health Ministry ) గురువారం సాయంత్రం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య  3,90,195కి పెరగగా.. ఇప్పటివరకు 3,633 మంది కరోనాతో మరణించారు. Also read: Apsara Rani: స్విమ్ డ్రెస్‌లో రెచ్చిపోయిన అప్సర

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 94,209 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటివరకు కరోనా నుంచి 2,95,248 మంది బాధితులు కోలుకున్నారు. గత 24గంటల్లో 61,300 టెస్టులు చేయగా.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 34,79,990 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. జిల్లాల వారీగా కరోనా కేసులు, మరణాల వివరాలు ఇలా ఉన్నాయి..

ap coronavirus bulletin

Also read: Seerat Kapoor: పిచ్చెక్కిస్తున్న సీరత్ కపూర్ సోయగాలు

Trending News