చంద్రబాబు పాలన‌పై గవర్నర్ కు బీజేపీ నేతల ఫిర్యాదు

Last Updated : Jul 3, 2018, 08:51 PM IST
చంద్రబాబు పాలన‌పై గవర్నర్ కు బీజేపీ నేతల ఫిర్యాదు

ఏపీ బీజేపీ నేతలు ఈ రోజు గవర్నర్ నరసింహన్ ను కలిసి చంద్రబాబు పాలనపై ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని.. మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని ..కాబట్టి గవర్నర్ చొరవ చూపి రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయాలని కోరారు..

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తనతో సహా బీజేపీ నేతలపై దాడులకు దిగడం సరికాదన్నారు. తమ వారిపై దాడులు జరుగుతున్నా కూడా పోలీసులు పట్టించుకోవడం లేదని అన్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు కూడా పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అందుకే ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకొని రాష్ట్రంలో ఏపీలో రాష్ట్రపతిపాలనకు సిఫార్సు చేయాలని గవర్నర్ నరసింహన్ కోరామన్నారు.    

Trending News